1.95 మిలియన్ సౌదీ రియాల్స్ దొంగతనం కేసులో ఇద్దరు అనుమానితుల అరెస్ట్
- March 04, 2020
రియాద్:సౌదీ పోలీసులు, ఇద్దరు అనుమానితుల్ని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. రియాద్లోని ఓ బ్యాంకు నుంచి డబ్బుని తరలిస్తున్న వాహనంపై దాడి చేసి 1.95 మిలియన్సౌదీ రియాల్స్ని దొంగతనం చేసిన కేసులో వీరిని నిందితులుగా భావిస్తున్నారు. గత ఏడాది డిసెంబర్ 13న ఈ ఘటన జరిగిందని రియాద్ పోలీస్ డిపార్ట్మెంట్ అధికార ప్రతినిది¸ లెఫ్టినెంట్ కల్నల్ షకీర్ అల్ తువైజిరి చెప్పారు. డబ్బు తరలిస్తున్న బ్యాంకు వాహనంపై ఆయుధాలతో దాడి చేసి, డబ్బుని దొంగిలించి ఫేక్ నెంబర్ ప్లేట్తో కూడిన కారులో నిందితులు పారిపోయారు. ఈ ఘటనలో పాల్గొన్న మరో ఇద్దరు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు.
తాజా వార్తలు
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు
- పీఎం ఇంటర్న్షిప్ పథకంలో ఏపీకి మరిన్ని అవకాశాలు కోరిన ఎంపీ బాలశౌరి
- హైవే ప్రయాణికులకు కేంద్రం భారీ శుభవార్త







