కరోనా అలర్ట్:దుబాయ్ లో ఇండియన్ స్కూల్ స్టూడెంట్ కి కరోనా
- March 05, 2020
దుబాయ్ లో ఇండియన్ స్కూల్ లో 16 ఏళ్ల బాలుడికి కరోనా టెస్టులో పాజిటీవ్ వచ్చింది. ఓవర్సీస్ నుంచి తిరిగి వచ్చిన తన తండ్రి నుంచి బాలుడికి కోవిడ్-19 సోకింది. విదేశాల నుంచి తిరిగొచ్చిన ఐదు రోజుల తర్వాత అతనిలో కరోనా లక్షణాలు బయటపడ్డాయి. అతనికి బ్లడ్ శాంపుల్ టెస్ట్ చేయటంతో వైరస్ ఉన్నట్లు తేలింది. అతని కుటుంబ సభ్యులకు కూడా టెస్ట్ చేయటంతో 16 ఏళ్ల బాలుడికి కూడా పాజిటీవ్ వచ్చింది. దీంతో ఎన్ఆర్ఐ ఫ్యామిలీని అస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని డాక్టర్లు చెబుతున్నారు. లేటెస్ట్ కేసుతో అలర్టైన దుబాయ్ హెల్త్ అథారిటీ వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా ప్రివెంటీవ్ మెజర్స్ పై ఫోకస్ చేస్తున్నారు. కరోనా ఇన్ ఫెక్టెడ్ స్టూడెంట్ చదువుతున్న ఇండియన్ స్కూల్ కు సెలవులు ప్రకటించారు. అంతర్జాతీయ ప్రమాణాలకు తగినట్లు స్కూల్ లో శానిటైజేషన్ చేపట్టారు. అలాగే స్కూల్ లో చదువుతున్న స్టూడెంట్స్, స్టూడెంట్స్ ఫ్యామిలీస్, స్కూల్ స్టాఫ్ హెల్త్ కండీషన్ ను మానిటర్ చేస్తున్నారు. వాళ్లందరికీ కోవిడ్-19 టెస్టులు చేస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!







