కరోనా ఎఫెక్ట్ : ప్రార్ధన సమయం 10 నిమిషాలు మించొద్దు..యూఏఈ సర్క్యూలర్
- March 06, 2020
యూఏఈ:కరోనా ఎఫెక్ట్ తో ఫ్రైడే ప్రార్ధనల సమయాన్ని ఇస్లామిక్ అఫైర్స్ అండ్ ఎండోమెంట్స్ జనరల్ అథారిటీ కుదించింది. కేవలం పది నిమిషాల్లో ఖచ్చితంగా ప్రేయర్ ముగించాలని యూఏఈలోని అన్ని మసీదుల్లోని ఇమామ్ లకు సర్క్యూలర్ జారీ చేసింది. జనసమూహం ఉండే ప్రదేశాల్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. తమ సర్క్యూలర్ ప్రార్ధన విధానంపై డైరెక్షన్స్ ఇచ్చారు. ఇమామ్లు పవిత్ర ఖురాన్ లోని రెండు శ్లోకాలను మాత్రమే చదవాలని, ప్రసంగ లేఖలో పేర్కొన్న ఖచ్చితమైన ప్రసంగం, దువాను చదవాలని క్లారిటీ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రార్థన 10 నిమిషాలకు మించరాదని, ఈ సూచనలను ఖచ్చితంగా పాటించాలన్నారు. ఈ విధానం కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు దోహదపడుతుందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!