కరోనా ఎఫెక్ట్ : ప్రార్ధన సమయం 10 నిమిషాలు మించొద్దు..యూఏఈ సర్క్యూలర్
- March 06, 2020
యూఏఈ:కరోనా ఎఫెక్ట్ తో ఫ్రైడే ప్రార్ధనల సమయాన్ని ఇస్లామిక్ అఫైర్స్ అండ్ ఎండోమెంట్స్ జనరల్ అథారిటీ కుదించింది. కేవలం పది నిమిషాల్లో ఖచ్చితంగా ప్రేయర్ ముగించాలని యూఏఈలోని అన్ని మసీదుల్లోని ఇమామ్ లకు సర్క్యూలర్ జారీ చేసింది. జనసమూహం ఉండే ప్రదేశాల్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. తమ సర్క్యూలర్ ప్రార్ధన విధానంపై డైరెక్షన్స్ ఇచ్చారు. ఇమామ్లు పవిత్ర ఖురాన్ లోని రెండు శ్లోకాలను మాత్రమే చదవాలని, ప్రసంగ లేఖలో పేర్కొన్న ఖచ్చితమైన ప్రసంగం, దువాను చదవాలని క్లారిటీ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రార్థన 10 నిమిషాలకు మించరాదని, ఈ సూచనలను ఖచ్చితంగా పాటించాలన్నారు. ఈ విధానం కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు దోహదపడుతుందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







