కరోనా ఎఫెక్ట్ : ప్రార్ధన సమయం 10 నిమిషాలు మించొద్దు..యూఏఈ సర్క్యూలర్
- March 06, 2020
యూఏఈ:కరోనా ఎఫెక్ట్ తో ఫ్రైడే ప్రార్ధనల సమయాన్ని ఇస్లామిక్ అఫైర్స్ అండ్ ఎండోమెంట్స్ జనరల్ అథారిటీ కుదించింది. కేవలం పది నిమిషాల్లో ఖచ్చితంగా ప్రేయర్ ముగించాలని యూఏఈలోని అన్ని మసీదుల్లోని ఇమామ్ లకు సర్క్యూలర్ జారీ చేసింది. జనసమూహం ఉండే ప్రదేశాల్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. తమ సర్క్యూలర్ ప్రార్ధన విధానంపై డైరెక్షన్స్ ఇచ్చారు. ఇమామ్లు పవిత్ర ఖురాన్ లోని రెండు శ్లోకాలను మాత్రమే చదవాలని, ప్రసంగ లేఖలో పేర్కొన్న ఖచ్చితమైన ప్రసంగం, దువాను చదవాలని క్లారిటీ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రార్థన 10 నిమిషాలకు మించరాదని, ఈ సూచనలను ఖచ్చితంగా పాటించాలన్నారు. ఈ విధానం కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు దోహదపడుతుందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!







