దుబాయ్:రోడ్ యాక్సిడెంట్ 29 ఏళ్ల NRI మృతి
- March 07, 2020దుబాయ్ లో 29 ఏళ్ల ఎన్ఆర్ఐ రోడ్డు ప్రమాదం మృతి చెందాడు. శుక్రవారం ఉదయం తాము ప్రయాణిస్తున్న మినివ్యాన్ ను ఓ ట్రక్కు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతుడు ముహమ్మద్ సవాద్ సొంతూరు కేరళాలోని మళప్పురన్ జిల్లా. ప్రమాదం జరిగిన సమయంలో ముహమ్మద్ సవాద్ ప్యాసింజర్ సీట్లో కూర్చున్నాడని..యాక్సిడెంట్ జరగ్గానే స్పాట్ లోనే అతను మరణించాడని సోషల్ వర్కర్ నసీర్ వతనపల్లి తెలిపారు. ఈ ప్రమాదంలో డ్రైవర్ మొహ్మద్ అబ్దుల్ కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అతను దుబాయ్ లోని ఎమిరాతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సవాద్, అబ్దుల్ ఇద్దరు అబుదాబిలోని రెస్టారెంట్లకు ఫిష్ సప్లై చేస్తుంటారు. ప్రమాదం జరిగిన సమయంలో కూడా ఓ రెస్టారెంట్ కు ఫిష్ సప్లై చేసి దుబాయ్ నుంచి అబుదాబికి తిరిగి వస్తున్నారని నసీర్ వెల్లడించారు. బాధితుల ఇద్దరి కుటుంబాలు యూఏఈలోనే ఉంటున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు