దుబాయ్:రోడ్ యాక్సిడెంట్ 29 ఏళ్ల NRI మృతి
- March 07, 2020దుబాయ్ లో 29 ఏళ్ల ఎన్ఆర్ఐ రోడ్డు ప్రమాదం మృతి చెందాడు. శుక్రవారం ఉదయం తాము ప్రయాణిస్తున్న మినివ్యాన్ ను ఓ ట్రక్కు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతుడు ముహమ్మద్ సవాద్ సొంతూరు కేరళాలోని మళప్పురన్ జిల్లా. ప్రమాదం జరిగిన సమయంలో ముహమ్మద్ సవాద్ ప్యాసింజర్ సీట్లో కూర్చున్నాడని..యాక్సిడెంట్ జరగ్గానే స్పాట్ లోనే అతను మరణించాడని సోషల్ వర్కర్ నసీర్ వతనపల్లి తెలిపారు. ఈ ప్రమాదంలో డ్రైవర్ మొహ్మద్ అబ్దుల్ కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అతను దుబాయ్ లోని ఎమిరాతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సవాద్, అబ్దుల్ ఇద్దరు అబుదాబిలోని రెస్టారెంట్లకు ఫిష్ సప్లై చేస్తుంటారు. ప్రమాదం జరిగిన సమయంలో కూడా ఓ రెస్టారెంట్ కు ఫిష్ సప్లై చేసి దుబాయ్ నుంచి అబుదాబికి తిరిగి వస్తున్నారని నసీర్ వెల్లడించారు. బాధితుల ఇద్దరి కుటుంబాలు యూఏఈలోనే ఉంటున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?