కరోనా ఎఫెక్ట్: 9 దేశాలపై తాత్కాలిక నిషేధాన్ని విధించిన సౌదీ
- March 09, 2020
రియాద్: కొవిడ్-19(కరోనా)ను అదుపులోకి తెచ్చేందుకు సౌదీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సౌదీలో కరోనా వ్యాపించకుండా, అదేవిధంగా ఇప్పటివరకు ఉన్న పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు తొమ్మిది దేశాల నుంచి రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ నిలిపివేత ప్యాసెంజర్లపై కూడా ఉన్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. నిషేధించిన దేశాల్లో 14 రోజుల ముందు నుంచి ఉన్న వారెవరు దేశంలోకి ప్రవేశించకూడదని ఆదేశించింది. దీంతో సౌదీ, తొమ్మిది దేశాల మధ్య ప్యాసెంజర్లకు అంతరాయం కలగనుంది. ఎయిర్లైన్స్తో పాటు బోటు ప్రయాణాలపై కూడా ఈ నిషేధమున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. షిప్పింగ్, వాణిజ్య, ఇతరుల తరలింపు వంటి వాటిని మాత్రం ఈ నిలిపివేత నుంచి మినాహాయిస్తున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది.
ప్రభుత్వం నిషేధించిన దేశాల జాబితాలో.. యూఏఈ, కువైట్, బహ్రెయిన్, లెబనాన్, సిరియా, సౌత్ కొరియా, ఈజిప్ట్, ఇటలీ మరియు ఇరాక్ దేశాలు ఉన్నాయి. కరోనా వైరస్ను అదుపులోకి తెచ్చేందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు హోంశాఖ ప్రకటించింది. దేశ ప్రజల ఆరోగ్యం, భద్రత కోసం ఇలా తాత్కాలికంగా రాకపోకలను నిషేధించాల్సి వచ్చిందని ప్రభుత్వం పేర్కొంది. కాగా.. కీలక సమయాల్లో మాత్రం ప్రభుత్వం కొందరి రాకపోకలకు అనుమతి ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







