కరోనా ఎఫెక్ట్: 9 దేశాలపై తాత్కాలిక నిషేధాన్ని విధించిన సౌదీ
- March 09, 2020
రియాద్: కొవిడ్-19(కరోనా)ను అదుపులోకి తెచ్చేందుకు సౌదీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సౌదీలో కరోనా వ్యాపించకుండా, అదేవిధంగా ఇప్పటివరకు ఉన్న పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు తొమ్మిది దేశాల నుంచి రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ నిలిపివేత ప్యాసెంజర్లపై కూడా ఉన్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. నిషేధించిన దేశాల్లో 14 రోజుల ముందు నుంచి ఉన్న వారెవరు దేశంలోకి ప్రవేశించకూడదని ఆదేశించింది. దీంతో సౌదీ, తొమ్మిది దేశాల మధ్య ప్యాసెంజర్లకు అంతరాయం కలగనుంది. ఎయిర్లైన్స్తో పాటు బోటు ప్రయాణాలపై కూడా ఈ నిషేధమున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. షిప్పింగ్, వాణిజ్య, ఇతరుల తరలింపు వంటి వాటిని మాత్రం ఈ నిలిపివేత నుంచి మినాహాయిస్తున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది.
ప్రభుత్వం నిషేధించిన దేశాల జాబితాలో.. యూఏఈ, కువైట్, బహ్రెయిన్, లెబనాన్, సిరియా, సౌత్ కొరియా, ఈజిప్ట్, ఇటలీ మరియు ఇరాక్ దేశాలు ఉన్నాయి. కరోనా వైరస్ను అదుపులోకి తెచ్చేందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు హోంశాఖ ప్రకటించింది. దేశ ప్రజల ఆరోగ్యం, భద్రత కోసం ఇలా తాత్కాలికంగా రాకపోకలను నిషేధించాల్సి వచ్చిందని ప్రభుత్వం పేర్కొంది. కాగా.. కీలక సమయాల్లో మాత్రం ప్రభుత్వం కొందరి రాకపోకలకు అనుమతి ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..