తెలంగాణలో స్కూల్స్, థియోటర్స్ బంద్

- March 14, 2020 , by Maagulf
తెలంగాణలో స్కూల్స్, థియోటర్స్ బంద్

హైదరాబాద్: మార్చి 31 వరకు స్కూళ్లు, కాలేజీలు, సినిమా థియేటర్లు, షాపింగ్‌ మాల్స్‌లను ముసివేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇవాళ కరోనాపై సీఎం కేసీఆర్‌ హైలెవల్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కరోనా నేపథ్యంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. కరోనా కారణంగా తెలంగాణ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. ప్రస్తుతం జరుగుతున్న పరీక్షలను కొనసాగించే అవకాశం ఉంది. టెన్త్‌ పరీక్షల నిర్వహణపై నిర్ణయం ప్రభుత్వం తీసుకోనుంది. కాగా రేపు, ఎల్లుండి అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. మీటింగ్ నిర్ణయాలను సాయంత్రం కేబినెట్ ముందు సీఎం ఉంచనున్నారు. కేబినెట్ భేటీ తర్వాత కేసీఆర్ మీడియా ముందుకు రానున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com