కరోనా ఎఫెక్ట్ : విదేశాల నుంచి సౌదీకి వచ్చే కరెన్సీకి కూడా ఐసోలేషన్
- March 15, 2020
కరోనా వైరస్ విస్తరించకుండా పకడ్బందీ చర్యలు చేపడుతున్న సౌదీ అరేబియా ప్రభుత్వం..మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఏ మార్గం ద్వారా అయినా విదేశాల నుంచి సౌదీలోకి ప్రవేశించే కరెన్సీని కూడా ఐసోలేట్ చేయాలని నిర్ణయించింది. ఇక నుంచి విదేశాల్లోని సౌదీ అరేబియా మానిటరీ అథారిటీ -SAMA బ్రాంచెస్ నుంచి గానీ మనీ ట్రాన్స్ పోర్ట్ కంపెనీస్ ద్వారా దేశంలోకి ట్రాన్స్ ఫర్ అయ్యే కరెన్సీ కూడా ఐసోలేట్ అయ్యాకే దేశంలోకి విడుదల చేస్తారు. కోవిడ్-19 వైరస్ వ్యాప్తికి కారణం అయ్యే అవకాశాలు ఉండటంతో సౌదీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కరెన్సీ నోట్లు, కాయిన్స్ మాత్రమే కాదు..ప్రతీ రోజు వాడే సామాగ్రిని కూడా శానిటైజ్ చేస్తున్నారు. డోర్ హ్యాండిల్స్, ట్రాలీస్, మార్కెట్లు, ఎయిర్ పోర్టులలో కొనుగోలు చేసిన వస్తువులు, ఇతర ప్రాంతాల్లోని సర్ ఫెస్ కూడా వైరస్ వ్యాప్తి చెందే కారకాలుగా మారే అవకాశాలు ఉన్నాయన్నది అధికారులు చెబుతున్నారు. అందుకే ఆయా వస్తువులను కూడా శానిటైజ్ చేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే ప్రజలు ఎప్పటికప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కోవటం ద్వారా కరోనా వైరస్ బారిన పడకుండా తమను తాము రక్షించుకోవచ్చని సూచించారు.
తాజా వార్తలు
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి







