ఉమ్ అల్ కువైన్లో ట్రాఫిక్ జరీమానాలపై 50 శాతం తగ్గింపు
- March 20, 2020
ఉమ్ అల్ కువైన్: ఉమ్ అల్ కువైన్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్, ట్రాఫిక్ జరీమానాలపై 50 శాతం తగ్గింపు అందుబాటులోకి తెచ్చింది. మార్చి 20 నుంచి మే 30 వరకు ఈ తగ్గింపు అమల్లో వుంటుంది. ట్రాఫిక్ జరీమానాలు, ట్రాఫిక్ పాయింట్స్, ఇంపౌండ్ వెహికిల్స్కి ఈ తగ్గింపు వర్తిస్తుంది. ఉమ్ అల్ కువైన్ పోలీస్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ కల్నల్ సయీద్ ఒబైద్ బిన్ అరన్ మాట్లాడుతూ, వాహనదారులపై జరీమానాల భారాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. వాహనదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన అభ్యర్థించారు. మార్చి 19కి ముందు జారీ అయిన జరీమానాలకు ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్కి చెందిన స్మార్ట్ అప్లికేషన్స్ ద్వారా ఈ జరీమానాల చెల్లింపు చేయాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







