ఉమ్ అల్ కువైన్లో ట్రాఫిక్ జరీమానాలపై 50 శాతం తగ్గింపు
- March 20, 2020
ఉమ్ అల్ కువైన్: ఉమ్ అల్ కువైన్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్, ట్రాఫిక్ జరీమానాలపై 50 శాతం తగ్గింపు అందుబాటులోకి తెచ్చింది. మార్చి 20 నుంచి మే 30 వరకు ఈ తగ్గింపు అమల్లో వుంటుంది. ట్రాఫిక్ జరీమానాలు, ట్రాఫిక్ పాయింట్స్, ఇంపౌండ్ వెహికిల్స్కి ఈ తగ్గింపు వర్తిస్తుంది. ఉమ్ అల్ కువైన్ పోలీస్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ కల్నల్ సయీద్ ఒబైద్ బిన్ అరన్ మాట్లాడుతూ, వాహనదారులపై జరీమానాల భారాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. వాహనదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన అభ్యర్థించారు. మార్చి 19కి ముందు జారీ అయిన జరీమానాలకు ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్కి చెందిన స్మార్ట్ అప్లికేషన్స్ ద్వారా ఈ జరీమానాల చెల్లింపు చేయాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- పని మనుషులతో జాగ్రత్త: సీపీ సజ్జనార్
- యువతి ప్రాణాలను కాపాడిన మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు
- ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానంగా ఖతార్..!!
- రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి: కేటీఆర్
- దుబాయ్ ఇ-స్కూటర్ రూల్స్: జోన్లు, జరిమానాల పై ఆర్టీఏ క్లారిటీ..!!
- అంతర్జాతీయ ఫోటోగ్రఫీ పోటీలో మెరిసిన ఒమన్..!!
- హోర్ముజ్ జలసంధి దిగ్బంధనం..ప్రపంచ వాణిజ్యానికి ముప్పు..!!
- కువైట్ లో ప్రజా రవాణా వ్యవస్థ ఆధునీకీకరణ..!!
- మక్కా, మదీనాలో 23వేలకు పైగా తనిఖీలు..!!
- చూపు లేకుండా శిశువు జననం..తల్లికి రూ.కోటి పరిహారం









