ఉమ్ అల్ కువైన్లో ట్రాఫిక్ జరీమానాలపై 50 శాతం తగ్గింపు
- March 20, 2020
ఉమ్ అల్ కువైన్: ఉమ్ అల్ కువైన్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్, ట్రాఫిక్ జరీమానాలపై 50 శాతం తగ్గింపు అందుబాటులోకి తెచ్చింది. మార్చి 20 నుంచి మే 30 వరకు ఈ తగ్గింపు అమల్లో వుంటుంది. ట్రాఫిక్ జరీమానాలు, ట్రాఫిక్ పాయింట్స్, ఇంపౌండ్ వెహికిల్స్కి ఈ తగ్గింపు వర్తిస్తుంది. ఉమ్ అల్ కువైన్ పోలీస్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ కల్నల్ సయీద్ ఒబైద్ బిన్ అరన్ మాట్లాడుతూ, వాహనదారులపై జరీమానాల భారాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. వాహనదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన అభ్యర్థించారు. మార్చి 19కి ముందు జారీ అయిన జరీమానాలకు ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్కి చెందిన స్మార్ట్ అప్లికేషన్స్ ద్వారా ఈ జరీమానాల చెల్లింపు చేయాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- ఖతార్లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్కు ఆహ్వానం
- దుబాయ్ పోలీసుల్లో 36 ఆర్పీఏ రోబోలు..
- తెలంగాణలో కొత్త క్రిమినల్ చట్టాల అమలు పై NCRB డైరెక్టర్ సమీక్ష
- ఏపీలో వేసవిని తలపిస్తున్న ఎండలు
- కల్తీ మద్యం తాగి 14 మంది మృతి..
- ISRO ప్రైవేటీకరణపై క్లారిటీ ఇవ్వండి
- సౌదీ-మలేషియా జాయింట్ ఆపరేషన్.. డ్రగ్ నెట్వర్క్ బస్ట్..!!
- హవల్లీ, ముబారక్ అల్-కబీర్ ప్రాంతాల్లో పలుచోట్ల పవర్ కట్..!!
- కతారా హాస్పిటాలిటీ.. హోటళ్లు, రిసార్టుల్లో 40 శాతం వరకు ఆదా..!!







