యూఏఈ:క్వారంటైన్ లో ఉన్న ఉద్యోగులకు జీతం చెల్లించాల్సిందే
- March 21, 2020
యూఏఈకి చెందిన కంపెనీలు తమ ఉద్యోగులకు క్వారంటైన్(స్వీయ నిర్బంధం) లో ఉన్న కాలంలో జీతం చెల్లించాల్సిందేనని ప్రభుత్వం ఆదేశించింది. విదేశాల నుంచి వచ్చిన తర్వాత ఉద్యోగులు స్వీయ నిర్బంధంలో ఉండాలని కంపెనీలు సూచిస్తున్న విషయం తెలిసిందే. దీనికితోడు కోవిడ్-19 లక్షణాలు ఉన్నవారిని క్వారంటైన్ కు తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు ఆర్ధిక ఇబ్బందులు తలెత్తకుండా ఆయా కంపెనీలు క్వారంటైన్ గడువు కాలానికి కూడా జీతం చెల్లించాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. ఫెడరల్ లా నెంబర్ 8,1980లోని ఆర్టికల్ 83(2) ప్రకారం క్వారంటైన్ కాలాన్ని సిక్ లీవ్ గా పరిగణించాల్సి ఉంటుంది. అయితే ప్రైవేట్ కంపెనీల విషయంలో మాత్రం ఇంకా ప్రభుత్వం నుంచి ఎలాంటి మార్గనిర్దేశకాలుగానీ, మానవ వనరుల మంత్రిత్వ శాఖ నుంచి ఎలాంటి మినిస్ట్రీయల్ ఆర్డర్స్ గానీ వెలువడలేదు. అయినా...కంపెనీల ఫోర్స్ తో ఉద్యోగులు క్వారంటైన్ లో ఉండాల్సి వస్తే మాత్రం సిక్ లీవ్ గా పరిగణించాల్సి వస్తుంది. లేదంటే ఆర్టికల్ 83 ఉల్లంఘన కిందకి వస్తుందని మాత్రం అధికారులు చెబుతున్నారు. ఒకవేళ ఉద్యోగులే తమంతట తాము హోమ్ క్వారంటైన్ అయితే మాత్రం సిక్ లీవ్ గా పరిగణించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో ‘శ్రావణం 2026’ షెడ్యూల్.. ఘనంగా ఓణం వేడుకలు..!!
- మెడికల్ ఎమర్జెన్సీ.. దోహా–బెంగళూరు ఇండిగో విమానం మస్కట్కు మళ్లింపు..!!
- రెండో EU–GCC సదస్సుకు సౌదీ అరేబియా ఆతిథ్యం..!!
- ఖతార్ లో పబ్లిక్ ప్రాసిక్యూషన్–స్టేట్ ఆడిట్ బ్యూరో మధ్య కీలక ఒప్పందం..!!
- యూఏఈలో అక్టోబర్ హాఫ్టర్మ్ సెలవులు ముందుకు.. పేరెంట్స్ అసంతృప్తి..!!
- కువైట్లో డీజిల్ చోరీ.. 41 మంది అరెస్ట్..!!
- ఉద్యోగుల సోషల్ మీడియా అకౌంట్లపై కేంద్రం ఫోకస్
- President of Senegal receives Al Zeyoudi in Dakar to discuss expanding trade and investment partnership
- యువత కోసం ట్రావెల్-ఫస్ట్ డిజిటల్ కార్డు
- ఢిల్లీలో భారీ వర్షాలు..ఎయిర్పోర్ట్లో వరద నీరు







