యూఏఈ:క్వారంటైన్ లో ఉన్న ఉద్యోగులకు జీతం చెల్లించాల్సిందే
- March 21, 2020యూఏఈకి చెందిన కంపెనీలు తమ ఉద్యోగులకు క్వారంటైన్(స్వీయ నిర్బంధం) లో ఉన్న కాలంలో జీతం చెల్లించాల్సిందేనని ప్రభుత్వం ఆదేశించింది. విదేశాల నుంచి వచ్చిన తర్వాత ఉద్యోగులు స్వీయ నిర్బంధంలో ఉండాలని కంపెనీలు సూచిస్తున్న విషయం తెలిసిందే. దీనికితోడు కోవిడ్-19 లక్షణాలు ఉన్నవారిని క్వారంటైన్ కు తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు ఆర్ధిక ఇబ్బందులు తలెత్తకుండా ఆయా కంపెనీలు క్వారంటైన్ గడువు కాలానికి కూడా జీతం చెల్లించాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. ఫెడరల్ లా నెంబర్ 8,1980లోని ఆర్టికల్ 83(2) ప్రకారం క్వారంటైన్ కాలాన్ని సిక్ లీవ్ గా పరిగణించాల్సి ఉంటుంది. అయితే ప్రైవేట్ కంపెనీల విషయంలో మాత్రం ఇంకా ప్రభుత్వం నుంచి ఎలాంటి మార్గనిర్దేశకాలుగానీ, మానవ వనరుల మంత్రిత్వ శాఖ నుంచి ఎలాంటి మినిస్ట్రీయల్ ఆర్డర్స్ గానీ వెలువడలేదు. అయినా...కంపెనీల ఫోర్స్ తో ఉద్యోగులు క్వారంటైన్ లో ఉండాల్సి వస్తే మాత్రం సిక్ లీవ్ గా పరిగణించాల్సి వస్తుంది. లేదంటే ఆర్టికల్ 83 ఉల్లంఘన కిందకి వస్తుందని మాత్రం అధికారులు చెబుతున్నారు. ఒకవేళ ఉద్యోగులే తమంతట తాము హోమ్ క్వారంటైన్ అయితే మాత్రం సిక్ లీవ్ గా పరిగణించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ఓటింగ్ సరళి విపరీతంగా పెరిగే అవకాశం!
- తిరిగి విధుల్లో చేరిన ఎయిరిండియా ఎక్స్ప్రెస్ క్యాబిన్ సిబ్బంది!
- తెలంగాణలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన..
- లోక్సభ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: డీజీపీ రవిగుప్తా
- అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తు, ఫీజు, ప్రక్రియ
- దుబాయ్లో పెట్టుబడి ద్వారా ఉద్యోగి గోల్డెన్ వీసాకు మారవచ్చా?
- బహ్రెయిన్ చేరుకున్న అరబ్ లీగ్ చీఫ్
- మోసపూరిత ప్రకటనల పై సౌదీ హెచ్చరిక
- కువైట్ అమీర్ కు వ్యతిరేకంగా పోస్టులు..పలువురికి నోటీసులు
- 250 మంది ప్రవాసులకు ఒమానీ పౌరసత్వం