యూఏఈ:క్వారంటైన్ లో ఉన్న ఉద్యోగులకు జీతం చెల్లించాల్సిందే
- March 21, 2020
యూఏఈకి చెందిన కంపెనీలు తమ ఉద్యోగులకు క్వారంటైన్(స్వీయ నిర్బంధం) లో ఉన్న కాలంలో జీతం చెల్లించాల్సిందేనని ప్రభుత్వం ఆదేశించింది. విదేశాల నుంచి వచ్చిన తర్వాత ఉద్యోగులు స్వీయ నిర్బంధంలో ఉండాలని కంపెనీలు సూచిస్తున్న విషయం తెలిసిందే. దీనికితోడు కోవిడ్-19 లక్షణాలు ఉన్నవారిని క్వారంటైన్ కు తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు ఆర్ధిక ఇబ్బందులు తలెత్తకుండా ఆయా కంపెనీలు క్వారంటైన్ గడువు కాలానికి కూడా జీతం చెల్లించాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. ఫెడరల్ లా నెంబర్ 8,1980లోని ఆర్టికల్ 83(2) ప్రకారం క్వారంటైన్ కాలాన్ని సిక్ లీవ్ గా పరిగణించాల్సి ఉంటుంది. అయితే ప్రైవేట్ కంపెనీల విషయంలో మాత్రం ఇంకా ప్రభుత్వం నుంచి ఎలాంటి మార్గనిర్దేశకాలుగానీ, మానవ వనరుల మంత్రిత్వ శాఖ నుంచి ఎలాంటి మినిస్ట్రీయల్ ఆర్డర్స్ గానీ వెలువడలేదు. అయినా...కంపెనీల ఫోర్స్ తో ఉద్యోగులు క్వారంటైన్ లో ఉండాల్సి వస్తే మాత్రం సిక్ లీవ్ గా పరిగణించాల్సి వస్తుంది. లేదంటే ఆర్టికల్ 83 ఉల్లంఘన కిందకి వస్తుందని మాత్రం అధికారులు చెబుతున్నారు. ఒకవేళ ఉద్యోగులే తమంతట తాము హోమ్ క్వారంటైన్ అయితే మాత్రం సిక్ లీవ్ గా పరిగణించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







