యూఏఈ:క్వారంటైన్ లో ఉన్న ఉద్యోగులకు జీతం చెల్లించాల్సిందే
- March 21, 2020
యూఏఈకి చెందిన కంపెనీలు తమ ఉద్యోగులకు క్వారంటైన్(స్వీయ నిర్బంధం) లో ఉన్న కాలంలో జీతం చెల్లించాల్సిందేనని ప్రభుత్వం ఆదేశించింది. విదేశాల నుంచి వచ్చిన తర్వాత ఉద్యోగులు స్వీయ నిర్బంధంలో ఉండాలని కంపెనీలు సూచిస్తున్న విషయం తెలిసిందే. దీనికితోడు కోవిడ్-19 లక్షణాలు ఉన్నవారిని క్వారంటైన్ కు తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు ఆర్ధిక ఇబ్బందులు తలెత్తకుండా ఆయా కంపెనీలు క్వారంటైన్ గడువు కాలానికి కూడా జీతం చెల్లించాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. ఫెడరల్ లా నెంబర్ 8,1980లోని ఆర్టికల్ 83(2) ప్రకారం క్వారంటైన్ కాలాన్ని సిక్ లీవ్ గా పరిగణించాల్సి ఉంటుంది. అయితే ప్రైవేట్ కంపెనీల విషయంలో మాత్రం ఇంకా ప్రభుత్వం నుంచి ఎలాంటి మార్గనిర్దేశకాలుగానీ, మానవ వనరుల మంత్రిత్వ శాఖ నుంచి ఎలాంటి మినిస్ట్రీయల్ ఆర్డర్స్ గానీ వెలువడలేదు. అయినా...కంపెనీల ఫోర్స్ తో ఉద్యోగులు క్వారంటైన్ లో ఉండాల్సి వస్తే మాత్రం సిక్ లీవ్ గా పరిగణించాల్సి వస్తుంది. లేదంటే ఆర్టికల్ 83 ఉల్లంఘన కిందకి వస్తుందని మాత్రం అధికారులు చెబుతున్నారు. ఒకవేళ ఉద్యోగులే తమంతట తాము హోమ్ క్వారంటైన్ అయితే మాత్రం సిక్ లీవ్ గా పరిగణించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- IPL2026: ఢిల్లీ క్యాపిటల్స్ పై కోల్కతా నైట్ రైడర్స్ ఘనవిజయం
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ప్రారంభించిన అపోలో హాస్పిటల్స్
- యూఏఈలో ప్రత్యక్ష లేదా దూర విద్య పై మే 10న నిర్ణయం
- విదేశీ చదువులకు పావలా వడ్డీ రుణాలు..సీఎం కీలక నిర్ణయం
- పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా మళ్లీ రంగస్వామి
- ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- యూఏఈ: రెండు బాలిస్టిక్ క్షిపణులు, మూడు డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థ
- ‘విజయ్ అను నేను‘ అంటూ రేపు విజయ్ సీఎం గా ప్రమాణ స్వీకారం
- పని మనుషులతో జాగ్రత్త: సీపీ సజ్జనార్
- యువతి ప్రాణాలను కాపాడిన మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు









