యూఏఈలో కరోనాతో తొలి మృతి కేసులు..ఇద్దరు చనిపోయినట్లు ప్రకటన
- March 21, 2020
యూ.ఏ.ఈ:కరోనా వైరస్ కోరలు చాస్తోంది. యూఏఈలో ఇన్నాళ్లు వ్యాప్తి వరకు పరిమితమైన కరోనా కేసుల్లో తొలిసారిగా మృత్యుఘంటలు మోగిస్తోంది. కరోనా వైరస్ కారణంగా దేశంలో ఇద్దరు చనిపోయినట్లు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ప్రివెన్షన్ అధికారులు వెల్లడించారు. యూరప్ నుంచి వచ్చిన 78 ఏళ్ల అరబ్ వ్యక్తితో పాటు, యూఏఈలో ఉంటున్న 58 ఏళ్ల ఆసియా వ్యక్తి కరోనా వైరస్ కారణంగా మృతి చెందినట్లు ప్రకటించారు. యూరప్ నుంచి వ్యక్తికి కరోనా పాజిటీవ్ గా నిర్ధారణ అయ్యింది.
అయితే..చికిత్స తీసుకుంటున్న సమయంలో హార్ట్ అటాక్ రావటంతో అతను మృతి చెందినట్లు తెలిపారు. ఇక యూఏఈలో ఉంటున్న ఆసియా వ్యక్తి కరోనాతో కిడ్నీలు ఫెయిల్ అవటంతో మృతి చెందినట్లు వెల్లడించారు. కరోనా వైరస్ కారణంగా మృతి చెందిన ఆ ఇద్దరి కుటుంబాలకు మినిస్ట్రీ సంతాపం వ్యక్తం చేసింది. కరోనా బారిన పడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు వెల్లడించింది.
తాజా వార్తలు
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- 25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చిన స్నేహితుడు..
- భారత్, న్యూజిలాండ్ ల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం
- పవన్ కల్యాణ్కు సర్జరీ సక్సెస్..త్వరగా కోలుకోవాలన్న సీఎం చంద్రబాబు!
- వేసవి రద్దీకి దుబాయ్ ఎయిర్పోర్ట్స్ సిద్ధం..
- మల్కాజ్గిరి భద్రత, పరిశుభ్రత పై పోలీస్–మున్సిపల్ శాఖల సమన్వయ సమావేశం
- షార్జాలో పర్యాటక రంగానికి భారీ ఊరట..!!
- ఇంట్లోనే అక్రమంగా రెస్టారెంట్..పలు ఉల్లంఘనలు నమోదు..!!
- ఒమన్–భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం.. సముద్ర భద్రతపై కీలక చర్చలు..!!







