దుబాయ్ : Dh700,000 చోరీ కేసులో దోపిడి గ్యాంగ్ ను కోర్టులో హజరు పర్చిన పోలీసులు
- March 22, 2020
దుబాయ్ లో దాదాపు Dh700,000 మేర సొమ్మును దోచుకున్న దోపిడి దొంగల గ్యాంగ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టు ముందు హజరుపరిచారు. గతేడాది డిసెంబర్ 16న దుబాయ్ లోని అల్ క్వాజ్ ఏరియాలో ఈ దోపిడి జరిగింది. రెండు కార్లలో వచ్చిన ఏడుగురు నగదు బదిలీ వాహనాన్ని అటకాయించి చోరీకి పాల్పడ్డారు. కార్లను నగదు బదిలీ వాహనానికి అడ్డుగా పెట్టి తమను కత్తులు, ఇనుప రాడ్లతో బెదిరించినట్లు డ్రైవర్, ఇద్దరు సెక్యూరిటీ గార్డులు కోర్టుకు వివరించారు. దొంగల్లో ఒకరు తన మెడపై కత్తి పెట్టి డబ్బును ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారని, లేదంటే పీక కోసేస్తానంటూ బెదిరించారని తెలిపాడు. ఇక చేసేది లేక నిస్సాయంగా డబ్బును దొంగలకు అప్పగించాల్సి వచ్చిందని వివరించారు. అయితే..ఒక కేసులో దొంగలు ఒకరు దేశం విడిచి పారిపోయే ప్రయత్నం చేస్తుండగా షార్జా ఇంటర్నేషనల్ కోర్టులో అతన్ని అరెస్ట్ చేశారు. అతను ఇచ్చిన సమాచారంతో మరో ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇంకో ముగ్గురు ఇంకా పరారీలో ఉన్నారు. అయితే..చోరీ సొత్తును పంచుకోగా తన వాటా Dh8000 మాత్రమే వచ్చిందని నిందితుల్లో ఒకరు కోర్టు తెలిపాడు. ఈ తదుపరి విచారణ ఏప్రిల్ 22కి వాయిదా పడింది.
తాజా వార్తలు
- ఇంటికి అడ్డుగా పార్కింగ్ చేస్తే QAR 300 జరిమానా..!!
- యూఏఈలోలో దాదాపు 20 విమానాలు ఆలస్యం, రద్దు..!!
- నిర్మాణ దుమ్ముపై రియాద్ కఠిన చర్యలు.. SR20 మిలియన్ జరిమానాలు..!!
- అబుదాబి ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్లో భారత విద్యార్థి సత్తా..!!
- దుక్మ్ పోర్టుకు వచ్చిన ప్రపంచంలోని అతిపెద్ద కార్ క్యారియర్..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్లకు 8 నెలల్లో 3.94 లక్షల విజిట్స్..!!
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర







