దుబాయ్ : Dh700,000 చోరీ కేసులో దోపిడి గ్యాంగ్ ను కోర్టులో హజరు పర్చిన పోలీసులు

- March 22, 2020 , by Maagulf
దుబాయ్ : Dh700,000 చోరీ కేసులో దోపిడి గ్యాంగ్ ను కోర్టులో హజరు పర్చిన పోలీసులు

దుబాయ్ లో దాదాపు Dh700,000 మేర సొమ్మును దోచుకున్న దోపిడి దొంగల గ్యాంగ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టు ముందు హజరుపరిచారు. గతేడాది డిసెంబర్ 16న దుబాయ్ లోని అల్ క్వాజ్ ఏరియాలో ఈ దోపిడి జరిగింది. రెండు కార్లలో వచ్చిన ఏడుగురు నగదు బదిలీ వాహనాన్ని అటకాయించి చోరీకి పాల్పడ్డారు. కార్లను నగదు బదిలీ వాహనానికి అడ్డుగా పెట్టి తమను కత్తులు, ఇనుప రాడ్లతో బెదిరించినట్లు డ్రైవర్, ఇద్దరు సెక్యూరిటీ గార్డులు కోర్టుకు వివరించారు. దొంగల్లో ఒకరు తన మెడపై కత్తి పెట్టి డబ్బును ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారని, లేదంటే పీక కోసేస్తానంటూ బెదిరించారని తెలిపాడు. ఇక చేసేది లేక నిస్సాయంగా డబ్బును దొంగలకు అప్పగించాల్సి వచ్చిందని వివరించారు. అయితే..ఒక కేసులో దొంగలు ఒకరు దేశం విడిచి పారిపోయే ప్రయత్నం చేస్తుండగా షార్జా ఇంటర్నేషనల్ కోర్టులో అతన్ని అరెస్ట్ చేశారు. అతను ఇచ్చిన సమాచారంతో మరో ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇంకో ముగ్గురు ఇంకా పరారీలో ఉన్నారు. అయితే..చోరీ సొత్తును పంచుకోగా తన వాటా Dh8000 మాత్రమే వచ్చిందని నిందితుల్లో ఒకరు కోర్టు తెలిపాడు. ఈ తదుపరి విచారణ ఏప్రిల్ 22కి వాయిదా పడింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com