దుబాయ్ : Dh700,000 చోరీ కేసులో దోపిడి గ్యాంగ్ ను కోర్టులో హజరు పర్చిన పోలీసులు
- March 22, 2020దుబాయ్ లో దాదాపు Dh700,000 మేర సొమ్మును దోచుకున్న దోపిడి దొంగల గ్యాంగ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టు ముందు హజరుపరిచారు. గతేడాది డిసెంబర్ 16న దుబాయ్ లోని అల్ క్వాజ్ ఏరియాలో ఈ దోపిడి జరిగింది. రెండు కార్లలో వచ్చిన ఏడుగురు నగదు బదిలీ వాహనాన్ని అటకాయించి చోరీకి పాల్పడ్డారు. కార్లను నగదు బదిలీ వాహనానికి అడ్డుగా పెట్టి తమను కత్తులు, ఇనుప రాడ్లతో బెదిరించినట్లు డ్రైవర్, ఇద్దరు సెక్యూరిటీ గార్డులు కోర్టుకు వివరించారు. దొంగల్లో ఒకరు తన మెడపై కత్తి పెట్టి డబ్బును ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారని, లేదంటే పీక కోసేస్తానంటూ బెదిరించారని తెలిపాడు. ఇక చేసేది లేక నిస్సాయంగా డబ్బును దొంగలకు అప్పగించాల్సి వచ్చిందని వివరించారు. అయితే..ఒక కేసులో దొంగలు ఒకరు దేశం విడిచి పారిపోయే ప్రయత్నం చేస్తుండగా షార్జా ఇంటర్నేషనల్ కోర్టులో అతన్ని అరెస్ట్ చేశారు. అతను ఇచ్చిన సమాచారంతో మరో ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇంకో ముగ్గురు ఇంకా పరారీలో ఉన్నారు. అయితే..చోరీ సొత్తును పంచుకోగా తన వాటా Dh8000 మాత్రమే వచ్చిందని నిందితుల్లో ఒకరు కోర్టు తెలిపాడు. ఈ తదుపరి విచారణ ఏప్రిల్ 22కి వాయిదా పడింది.
తాజా వార్తలు
- పోలింగ్కు పటిష్ట బందోబస్తు: సీపీ తరుణ్ జోషి
- రూ.4వేల ఆసరా పెన్షన్.. మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన
- జార్జియా: ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చిన 50 వేల మంది
- అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి
- సౌదీలో BON TUM మయోనైజ్ పై నిషేధం
- రస్ అల్ ఖైమాలో గాయపడ్డ వ్యక్తి ఎయిర్లిఫ్ట్
- మే14 వరకు ‘మ్యాంగో మానియా’ మహోత్సవం
- విదేశీయుల నియామకం..రెస్టారెంట్ యజమానికి భారీ ఫైన్
- ఒమన్ను సందర్శించిన ప్రముఖ భారతీయ సామాజిక కార్యకర్తలు
- 'నిద్రపోతున్న' టీచర్ని ఫోటో తీసినందుకు Dh2000 జరిమానా