దోహా:షాపుల దగ్గర ఇక సామాజిక దూరం తప్పనిసరి..మార్గదర్శకాలు విడుదల

- March 22, 2020 , by Maagulf
దోహా:షాపుల దగ్గర ఇక సామాజిక దూరం తప్పనిసరి..మార్గదర్శకాలు విడుదల

దోహా:కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు ఖతార్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి షాపుల దగ్గర సామాజిక దూరాన్ని తప్పనిసరిగా పాటించాల్సిందేనని సూచించింది. ప్రతీ రిటైల్ షాపు నిర్వాహకులు వినియోగదారుల మధ్య సామాజిక దూరాన్ని నిబద్ధతతో పాటించేలా తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని తెలుపుతూ మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మేరకు షాపులకు వెళ్లే వినియోగదారులు ఒక్కొక్కరి మధ్య ఖచ్చితంగా 1.5 మీటర్ల దూరం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. ఇది కూడా వినియోగదారుల భద్రతా చట్టం నెంబర్ 8లోని ఆర్టికల్ 13 కిందకు వస్తుందని కూడా కామర్స్, పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. 

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com