దోహా:షాపుల దగ్గర ఇక సామాజిక దూరం తప్పనిసరి..మార్గదర్శకాలు విడుదల
- March 22, 2020దోహా:కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు ఖతార్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి షాపుల దగ్గర సామాజిక దూరాన్ని తప్పనిసరిగా పాటించాల్సిందేనని సూచించింది. ప్రతీ రిటైల్ షాపు నిర్వాహకులు వినియోగదారుల మధ్య సామాజిక దూరాన్ని నిబద్ధతతో పాటించేలా తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని తెలుపుతూ మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మేరకు షాపులకు వెళ్లే వినియోగదారులు ఒక్కొక్కరి మధ్య ఖచ్చితంగా 1.5 మీటర్ల దూరం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. ఇది కూడా వినియోగదారుల భద్రతా చట్టం నెంబర్ 8లోని ఆర్టికల్ 13 కిందకు వస్తుందని కూడా కామర్స్, పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- ఏపీలో భానుడి విశ్వరూపం, బెంబేలెత్తిపోతున్న జనం
- వైసీపీ మేనిఫెస్టో ఫై ప్రశ్నల అస్త్రాలను సంధిస్తున్న నెటిజన్లు
- ఎన్నికల ప్రచారంలో హీరో వెంకటేశ్..?!!
- ఖతార్ విమానయాన రంగం.. అద్భుతమైన వృద్ధి..!
- సలాలా ఆటిజం సెంటర్.. ఆటిస్టిక్ పిల్లలకు వరం..!
- కాలువల్లో చనిపోయిన చేపలు.. మున్సిపాలిటీ క్లారిటీ
- యాంటీబయాటిక్స్ నిల్..పుకార్లను నమ్మొద్దు
- 15 ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదు.. అలర్ట్ జారీ
- 'రామాయణం' షూటింగ్ సెట్ నుంచి రణబీర్ కపూర్, సాయి పల్లవి ఫోటోలు లీక్..
- ముంబైలో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు..కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం