సైన్యానికి ఆ బాధ్యత అప్పగించిన స్పెయిన్...
- March 30, 2020కరోనా వలన యూరప్ దేశాలు విలవిలలాడిపోతున్నాయి. చైనా తరువాత యూరప్ లోకి ప్రవేశించిన కరోనా అక్కడి నుంచి విలయతాండవం చేస్తున్నది. ఇటలీ, స్పెయిన్ దేశాలలో వైరస్ బారిన పడుతున్న వ్యక్తుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతున్నది. వైరస్ నుంచి బయటపడేందుకు అన్ని దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. చైనాలో పుట్టిన ఈ వైరస్ అక్కడ చాలా వరకు కట్టడి అయ్యింది. యూరప్, అమెరికా దేశాల్లో మాత్రం అదుపు చేయలేకపోతున్నారు.
స్పెయిన్ లో చేయి దాటిపోవడంతో ఆ దేశం కీలక నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ విధించడంతో పాటుగా ప్రజలను కంట్రోల్ చేసే బాధ్యతను ప్రభుత్వం సైన్యానికి అప్పగించింది. అంతేకాదు, దీనికి సంబంధించి విశేషాధికారాలు సైన్యానికి ఇచ్చింది అక్కడి ప్రభుత్వం. దీంతో ఇప్పుడు ఆ దేశం సైన్యం చేతుల్లోకి వెళ్ళింది. ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న వైరస్ ను కట్టడి చేయడానికి స్పెయిన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆదివారం రోజున స్పెయిన్ లో ఏకంగా 6300 మంది కరోనా బారిన పడ్డారు. సామాజిక దూరం పాటించకుంటే మరింత దేశం మరింత తీవ్రమైన ఇబ్బందులు పడే అవకాశం ఉన్నది. అందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
తాజా వార్తలు
- పాట్నాలోని ఓ హోటల్లో భారీ అగ్నిప్రమాదం..6 గురు మృతి..
- నాలుగో విడత ఎన్నికలు..ముగిసిన నామినేషన్ల గడువు
- తెలంగాణలో తీవ్ర వడగాలులు..
- T20 ప్రపంచకప్...బ్రాండ్ అంబాసిడర్గా బోల్ట్
- తెలంగాణ రాష్ట్రంలో వేర్వేరు రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి
- ఇళ్ల మరమ్మతులకు Dh2 బిలియన్ ఫండ్
- ఈజిప్షియన్లకు వర్క్ పర్మిట్ జారీ నిలిపివేత..!
- విదేశీ కార్మికుల కోసం బహ్రెయిన్లో కొత్త చట్టం..!
- హాస్పిటల్లో చేరిన కింగ్ సల్మాన్..!
- ఒమన్ లో 'ఎక్స్చేంజ్ యువర్ ల్యాండ్' ప్రారంభం