సైన్యానికి ఆ బాధ్యత అప్పగించిన స్పెయిన్...
- March 30, 2020
కరోనా వలన యూరప్ దేశాలు విలవిలలాడిపోతున్నాయి. చైనా తరువాత యూరప్ లోకి ప్రవేశించిన కరోనా అక్కడి నుంచి విలయతాండవం చేస్తున్నది. ఇటలీ, స్పెయిన్ దేశాలలో వైరస్ బారిన పడుతున్న వ్యక్తుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతున్నది. వైరస్ నుంచి బయటపడేందుకు అన్ని దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. చైనాలో పుట్టిన ఈ వైరస్ అక్కడ చాలా వరకు కట్టడి అయ్యింది. యూరప్, అమెరికా దేశాల్లో మాత్రం అదుపు చేయలేకపోతున్నారు.
స్పెయిన్ లో చేయి దాటిపోవడంతో ఆ దేశం కీలక నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ విధించడంతో పాటుగా ప్రజలను కంట్రోల్ చేసే బాధ్యతను ప్రభుత్వం సైన్యానికి అప్పగించింది. అంతేకాదు, దీనికి సంబంధించి విశేషాధికారాలు సైన్యానికి ఇచ్చింది అక్కడి ప్రభుత్వం. దీంతో ఇప్పుడు ఆ దేశం సైన్యం చేతుల్లోకి వెళ్ళింది. ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న వైరస్ ను కట్టడి చేయడానికి స్పెయిన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆదివారం రోజున స్పెయిన్ లో ఏకంగా 6300 మంది కరోనా బారిన పడ్డారు. సామాజిక దూరం పాటించకుంటే మరింత దేశం మరింత తీవ్రమైన ఇబ్బందులు పడే అవకాశం ఉన్నది. అందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







