సైన్యానికి ఆ బాధ్యత అప్పగించిన స్పెయిన్...
- March 30, 2020
కరోనా వలన యూరప్ దేశాలు విలవిలలాడిపోతున్నాయి. చైనా తరువాత యూరప్ లోకి ప్రవేశించిన కరోనా అక్కడి నుంచి విలయతాండవం చేస్తున్నది. ఇటలీ, స్పెయిన్ దేశాలలో వైరస్ బారిన పడుతున్న వ్యక్తుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతున్నది. వైరస్ నుంచి బయటపడేందుకు అన్ని దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. చైనాలో పుట్టిన ఈ వైరస్ అక్కడ చాలా వరకు కట్టడి అయ్యింది. యూరప్, అమెరికా దేశాల్లో మాత్రం అదుపు చేయలేకపోతున్నారు.
స్పెయిన్ లో చేయి దాటిపోవడంతో ఆ దేశం కీలక నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ విధించడంతో పాటుగా ప్రజలను కంట్రోల్ చేసే బాధ్యతను ప్రభుత్వం సైన్యానికి అప్పగించింది. అంతేకాదు, దీనికి సంబంధించి విశేషాధికారాలు సైన్యానికి ఇచ్చింది అక్కడి ప్రభుత్వం. దీంతో ఇప్పుడు ఆ దేశం సైన్యం చేతుల్లోకి వెళ్ళింది. ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న వైరస్ ను కట్టడి చేయడానికి స్పెయిన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆదివారం రోజున స్పెయిన్ లో ఏకంగా 6300 మంది కరోనా బారిన పడ్డారు. సామాజిక దూరం పాటించకుంటే మరింత దేశం మరింత తీవ్రమైన ఇబ్బందులు పడే అవకాశం ఉన్నది. అందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







