కరోనా ఎఫెక్ట్:ఏప్రిల్ 4న జాతీయ సంతాప దినంగా ప్రకటించిన చైనా
- April 03, 2020బీజింగ్:కరోనా మహమ్మారికి బలైన వారికి సంతాపం తెలిపేందుకు ఏప్రిల్ 4న జాతీయ సంతాప దినం పాటించాలని చైనా ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా వలన ప్రాణాలు కోల్పోయిన డాక్టర్ లీ వెన్లీయాంగ్తోపాటు 3,300 మందికి పైగా చైనీయులకు శనివారం సంతాపం తెలియజేయాలని ప్రభుత్వం ఆదేశించింది. శనివారం చైనాతోపాటు విదేశాల్లోని అన్ని చైనా రాయబార కార్యాలయాల్లో జాతీయ జెండాలను అవనతం చేసి ఉంచుతారు.
దీంతో శనివారం దేశంలో అన్ని ప్రజా వినోద కార్యక్రమాలను రద్దు చేశామని సర్కారు ప్రకటించింది. శనివారం ఉదయం 10 గంటలకు దేశవ్యాప్తంగా ప్రజలు మూడు నిమిషాలు మౌనం పాటించి.. కరోనా మృతులకు సంతాపం తెలుపుతారు. ఈ సందర్భంగా విమానాలు, బస్సులు, రైళ్లు, ఓడల్లో సంతాపసూచకంగా సైరన్ మోగించనున్నారు.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈకి భారీ రెయిన్ అలెర్ట్
- ఉమ్రా వీసా వ్యవధిపై సౌదీ కీలక ఉత్తర్వులు
- ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్
- కార్మికులకు కువైట్ శుభవార్త..!
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ