యూఏఈ: విదేశీయులను వారి దేశాలకు తరలించేందుకు తాత్కాలిక ఫ్లైట్స్ ఏర్పాటు
- April 03, 2020
యూఏఈ :విదేశీయులు, ప్రవాసీయులను వారి వారి దేశాలకు తరలించేందుకు యూఏఈ తాత్కాలిక విమాన సర్వీసులను నడపనుంది. కరోనా వైరస్ ప్రభావంతో యూఏఈ అన్ని అంతర్జాతీయ సర్వీసులను రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో అక్కడ పర్యటించేందుకు వచ్చిన విదేశీయులు యూఏఈలోనే చిక్కుకుపోయారు. మరోవైపు దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రవాసీయులు కూడా సొంత దేశాలకు వెళ్లాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో పర్యాటకులు, ప్రవాసీయులు ప్రయాణమయ్యేందుకు అంతర్జాతీయ సర్వీసుల రద్దు నిర్ణయాన్ని కొద్ది మేర సడలించింది. తాత్కాలిక ఫ్లైట్లను ఏర్పాటు చేసి దేశంలో ఉన్న విదేశీయులను సొంత ప్రాంతాలకు తరలించాలని నిర్ణయించింది. ప్రవాసీయులు ఎవరైనా యూఏఈ విడిచి వెళ్లాలని అనుకుంటే ఆయా దేశాల రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని కూడా యూఏఈ విదేశాంగ శాఖ కోరింది.
తాజా వార్తలు
- యూఏఈ నుంచి భారత్కు ఎంత బంగారం తీసుకెళ్లొచ్చు? 2026లో కొత్త నిబంధనలు ఇవే..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!







