యూఏఈ: విదేశీయులను వారి దేశాలకు తరలించేందుకు తాత్కాలిక ఫ్లైట్స్ ఏర్పాటు
- April 03, 2020
యూఏఈ :విదేశీయులు, ప్రవాసీయులను వారి వారి దేశాలకు తరలించేందుకు యూఏఈ తాత్కాలిక విమాన సర్వీసులను నడపనుంది. కరోనా వైరస్ ప్రభావంతో యూఏఈ అన్ని అంతర్జాతీయ సర్వీసులను రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో అక్కడ పర్యటించేందుకు వచ్చిన విదేశీయులు యూఏఈలోనే చిక్కుకుపోయారు. మరోవైపు దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రవాసీయులు కూడా సొంత దేశాలకు వెళ్లాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో పర్యాటకులు, ప్రవాసీయులు ప్రయాణమయ్యేందుకు అంతర్జాతీయ సర్వీసుల రద్దు నిర్ణయాన్ని కొద్ది మేర సడలించింది. తాత్కాలిక ఫ్లైట్లను ఏర్పాటు చేసి దేశంలో ఉన్న విదేశీయులను సొంత ప్రాంతాలకు తరలించాలని నిర్ణయించింది. ప్రవాసీయులు ఎవరైనా యూఏఈ విడిచి వెళ్లాలని అనుకుంటే ఆయా దేశాల రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని కూడా యూఏఈ విదేశాంగ శాఖ కోరింది.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!