యూఏఈ: విదేశీయులను వారి దేశాలకు తరలించేందుకు తాత్కాలిక ఫ్లైట్స్ ఏర్పాటు
- April 03, 2020యూఏఈ :విదేశీయులు, ప్రవాసీయులను వారి వారి దేశాలకు తరలించేందుకు యూఏఈ తాత్కాలిక విమాన సర్వీసులను నడపనుంది. కరోనా వైరస్ ప్రభావంతో యూఏఈ అన్ని అంతర్జాతీయ సర్వీసులను రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో అక్కడ పర్యటించేందుకు వచ్చిన విదేశీయులు యూఏఈలోనే చిక్కుకుపోయారు. మరోవైపు దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రవాసీయులు కూడా సొంత దేశాలకు వెళ్లాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో పర్యాటకులు, ప్రవాసీయులు ప్రయాణమయ్యేందుకు అంతర్జాతీయ సర్వీసుల రద్దు నిర్ణయాన్ని కొద్ది మేర సడలించింది. తాత్కాలిక ఫ్లైట్లను ఏర్పాటు చేసి దేశంలో ఉన్న విదేశీయులను సొంత ప్రాంతాలకు తరలించాలని నిర్ణయించింది. ప్రవాసీయులు ఎవరైనా యూఏఈ విడిచి వెళ్లాలని అనుకుంటే ఆయా దేశాల రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని కూడా యూఏఈ విదేశాంగ శాఖ కోరింది.
తాజా వార్తలు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..
- ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- ప్రధాని మోడీ ప్రసంగం పై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం: ఈసీ
- కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం, 8 కార్లు ఢీ..
- భారతీయుల కోసం కొత్త ‘భా’ షూ సైజింగ్ సిస్టమ్..
- యూఏఈలో పెరగనున్న వాహన, ప్రాపర్టీ బీమా రేట్లు..!
- అక్రమ ప్రాక్టీస్..ప్రవాస మహిళా హెల్త్ ప్రాక్టీషనర్ అరెస్ట్
- వాతావరణ ప్రమాదాలపై కీలక కాన్ఫరెన్స్
- 'మాకు ఇప్పుడు ఇల్లు లేదు'.. దుబాయ్ టవర్ నివాసితులు ఆవేదన