కార్మికులకు ఫుడ్‌ మీల్స్‌ పంపిణీ చేసిన గవర్నర్‌

- April 06, 2020 , by Maagulf
కార్మికులకు ఫుడ్‌ మీల్స్‌ పంపిణీ చేసిన గవర్నర్‌

బహ్రెయిన్‌:క్యాపిటల్‌ గవర్నరేట్‌ గవర్నర్‌ షేక్‌ హిషామ్ బిన్‌ అబ్దుల్‌ రహ్మాన్‌, కరోనా క్రైసిస్‌ కారణంగా ఎఫెక్ట్‌ అయిన కార్మికుల్ని ఆదుకునేందుకు అన్ని చర్యలూ తీసుకున్నట్లు వెల్లడించింది. గవర్నరేట్‌లో ఛారిటబుల్‌ క్యాంపెయిన్‌ని ప్రారంభించామనీ, ఫుడ్‌ మీల్స్‌ని కార్మికులకు అందిస్తున్నామనీ చెప్పారు. కాగా, మీల్‌ ప్రిపరేషన్‌ హెడ్‌ క్వార్టర్‌ని హిషామ్ బిన్‌ అబ్దుల్‌ రహ్మాన్‌ అల్‌ ఖలీఫా సందర్శించారు. తొలి రోజు క్యాంపెయిన్‌ సందర్భంగా 1100 ఫుడ్‌ మీల్స్‌ని వలస కార్మికులకు అందజేశారు. ఈ సంఖ్య ముందు ముందు మరింత పెంచనున్నారు. కరోనా క్రైసిస్‌ ముగిసేవరకూ ఈ కార్యక్రమం కొనసాగుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com