దుబాయ్ స్టెరిలైజేషన్: వీళ్ళకి కూడా బయటకు వెళ్లాలంటే అనుమతి అవసరం
- April 06, 2020
దుబాయ్: దుబాయ్ లో కరోనా ను అరికట్టేందుకు రెండు వారాలపాటు 24 గంటలూ స్టెరిలైజ్ చేస్తున్న విషయం తెలిసిందే. మరి ఈ రెండువారాల లాక్ డౌన్ లో నిబంధనలు కూడా కఠినతరంగానే విధించారు పోలీసులు..ఇవి ఉల్లంఘించామా? అంతే సంగతి...భారీ ఫైన్ లు కట్టుకోవలసిందే.
ప్రజలు నిత్యావసరాల కోసం బయటకు వెళ్ళచ్చు కానీ దుబాయ్ పోలీసుల నుండి 'పర్మిట్' తెచ్చుకోవటం తప్పనిసరి. ఆఖరికి నడిచి/సైకిల్ మీద వెళ్లినా పర్మిట్ తప్పనిసరి అని నొక్కి చెప్తున్నారు అధికారులు. ఈ పర్మిట్ కోసం https://dxbpermit.gov.ae/permits కు లాగిన్ అవ్వాలి. ఆ వెబ్సైట్ కు లాగిన్ అయినప్పుడు, ప్రజలు ఏ రవాణా మోడ్ను ఉపయోగిస్తారనే దాని కోసం ఒక ఎంపికను ఎంచుకునేలా కొత్త ఎంపిక పొందుపరచబడింది అనగా ప్రజలు కారు, మెట్రో, బస్సు, నడక లేదా సైక్లింగ్ వంటి విభిన్న ఎంపికలను ఎంచుకోవచ్చు.
ప్రజలు ప్రతిరోజూ సూపర్మార్కెట్లు, ఫార్మసీలకు వెళ్లవద్దని, బదులుగా రెండు, మూడు రోజుల పాటు తగినంత ఆహారం మరియు ఔషధాలు కలిగి ఉండటానికి అవసరమైన వాటిని పెద్దమొత్తంలో కొనుగోలు చేయాలని పోలీసులు సూచించారు. పర్మిట్ కు అప్లై చేసేకంటే డెలివరీలను ఉపయోగించాలని అధికారి ప్రజలను కోరారు.
తాజా వార్తలు
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!