కరోనాపై పోరాటం:స్టెరిలైజషన్ చర్యల షెడ్యూల్ ప్రకటించిన అబుధాబి
- April 07, 2020అబుధాబి:కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు యూఏఈ ఆరోగ్య మంత్రిత్వ శాఖ మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా జాతీయ క్రిమిసంహారక చర్యలను కొనసాగించాలని నిర్ణయించింది. దీంతో అబుధాబిలో శానిటైజేషన్ డ్రైవ్ సమయాలను ప్రకటించారు. అబుధాబి అధికార వర్గాలు వెల్లడించిన ప్రకటన మేరకు రాజధానిలోని నివాస ప్రాంతాల్లో క్రిమిసంహారక చర్యలు ప్రతీ రోజు రాత్రి 8 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కొనసాగుతుంది. ఇక పారిశ్రామిక ప్రాంతాలు, కార్మికులు ఉండే ప్రాంతాల్లో సాయంత్రం 6 నుంచి ఉదయం 6 గంటల వరకు స్టెరిలైజేషన్(క్రిమిసంహారక) చేస్తారు. రసాయనాల పిచికారి చేస్తున్నందువల్ల ఆయా సమాయాల్లో ప్రజలు ఇళ్లలోనే ఉండి తమకు సహకరించాలని అధికారులు కోరారు. మరో రెండు వారాల పాటు ప్రతీ రోజు ఈ స్టెరిలైజేషన్(క్రిమిసంహారక) ప్రక్రియ కొనసాగనుంది.
--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?