యూఏఈ: ఇండియా, పాకిస్తాన్ కు ఫ్లైట్ దుబాయ్ టికెట్ బుకింగ్స్ ప్రారంభం
- April 07, 2020
దుబాయ్ బడ్జెట్ ఎయిర్ లైన్స్ ఫ్లై దుబాయ్ ఇండియా, పాకిస్తాన్ కు టికెట్స్ బుకింగ్ ను ప్రారంభించింది. కరోనా కారణంగా అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిచిపోవటంతో వేల మంది భారతీయులు, పాకిస్తానీయులు యూఈఏలో చిక్కుకుపోయారు. వారిని తమ సొంత దేశాలకు తరలించటంలో భాగంగా వచ్చే వారం ఫ్లై దుబాయ్ రెండు దేశాలకు విమాన సర్వీసులను పునరుద్ధరించే ప్రయత్నాల్లో ఉంది. అయితే..భారత్, పాకిస్తాన్ ప్రభుత్వాల నుంచి ఫ్లై దుబాయ్ కి ఇంకా అనుమతి రావాల్సి ఉంది. ఒక వేళ అనుమతి వస్తేనే సర్వీసులను పునరుద్ధరిస్తామని ఫ్లై దుబాయ్ వర్గాలు వెల్లడించాయి. ఏప్రిల్ 14 తర్వాత భారత్ లో లాక్ డౌన్ సడలించే అవకాశాలు ఉండటంతో తమకు అనుమతి వస్తుందనే ఫ్లై దుబాయ్ అంచనా వేస్తోంది. అయితే..యూఏఈలోని పాకిస్తాన్ రాయబార కార్యాలయం మాత్రం తమ దేశానికి ప్రత్యేక విమాన సర్వీసులపై తమకు ఎలాంటి సమాచారం లేదని చెబుతోంది. ఇదిలాఉంటే ఫ్లై దుబాయ్ భారత్ లోని హైదరాబాద్, అహ్మదాబాద్, చెన్నై, ఢిల్లీ, కొచ్చి, లక్నో, ముంబై నగరాలకు ఫ్లైట్ బుకింగ్స్ ప్రారంభించింది. అలాగే పాకిస్తాన్ లోని వివిధ నగరాలకు బుకింగ్స్ స్టార్ట్ చేసింది.
తాజా వార్తలు
- యూఏఈలో పరిస్థితి ప్రశాంతమే: ప్రభుత్వం
- ICC Rankings: నం.1 స్థానాన్ని కోల్పోయిన భారత్
- ఒమాన్లో డ్రోన్ దాడులు.. ముసందమ్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న దాడిని ఖండించిన సుల్తానేట్
- ఖతార్ పై క్షిపణి దాడి యత్నం..అడ్డుకున్న సాయుధ దళాలు
- ప్రైవేట్ కంపెనీలకు మిస్సైళ్ల తయారీ..కేంద్రం సంచలన నిర్ణయం!
- ఖతార్ మాజీ అమీర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్టు రెన్యువల్కు కొత్త విధానం..!!
- ప్రపంచంలోనే రెండో అత్యంత సురక్షిత దేశంగా ఒమన్..!!
- ‘మోస్ట్ పవర్ఫుల్ విమెన్-2026’ జాబితాలో తెలుగు మహిళలు!
- సౌదీలో బహ్రెయిన్ మహిళ, చిన్నారి మృతి..!!







