కరోనాను ఎదుర్కొనేందుకు రోగనిరోధక ప్లాస్మాను సిద్ధం చేస్తున్న కువైట్
- April 08, 2020
కువైట్: కువైట్ లోని 'బ్లడ్ బ్యాంకు' కరోనాను ఎదుర్కోవటానికి రోగనిరోధక ప్లాస్మాను తయారుచేయడం ప్రారంభించినట్లు ప్రకటించింది. "ఇది వైరస్ నుండి కోలుకుంటున్న దాతల నుండి సేకరించి అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం తయారు చేయబడుతుంది. ఒక దాత 3 రోగులకు చికిత్స చేయడానికి ఉపయోగపడతారు" అని బ్లడ్ బ్యాంక్ వద్ద రక్త మార్పిడి సేవల విభాగం డైరెక్టర్ డాక్టర్ రీమ్ అల్-రాద్వాన్ తెలిపారు.
వైరస్ ఎదుర్కొన్నప్పుడు సోకిన వ్యక్తి యొక్క శరీరం వ్యాధిని అధిగమించడానికి ప్రతిరోధకాలను ఏర్పరచడం ప్రారంభిస్తుంది. ఆ సమయంలో కోలుకున్న వ్యక్తి ప్లాస్మా రోగి కి అందించే ప్రక్రియ ప్రారంభమవుతుంది. దీంతో రోగికి రోగనిరోధక శక్తిని పెంపొందించగలం. రోగి యొక్క రక్త ప్లాస్మాలోని ప్రతిరోధకాలు మూడు వారాల పాటు అధిక స్థాయిలో ఉండి తరువాత తగ్గుతాయి కాబట్టి ప్రతి దాతకు ఒక నిర్దిష్ట కాలపరిమితి నిర్దేశించబడుతుంది. ముగ్గురు రోగులకు చికిత్స చేయడానికి ఒక దాత దోహదం చేస్తారని ఆమె వివరించారు.
ప్రస్తుతం ప్లాస్మాను 'జాబ్రియా' లోని సెంట్రల్ బ్లడ్ బ్యాంక్ లో దానం చేసినట్లు తెలుస్తోంది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







