దోహా:హాట్ లైన్ నెంబర్ ప్రారంభించిన జాతీయ మానవ హక్కుల సంఘం
- April 10, 2020
దోహా:ఖతార్ లోని పౌరులు, ప్రవాసీయుల హక్కుల పరిక్షణ, పలు సమస్యాత్మక సందర్భాల్లో సూచనలు చేసేందుకు జాతీయ మానవ హక్కుల సంఘం మరింత చొరవ తీసుకుంటోంది. దేశవ్యాప్తంగా అన్ని రీజియన్ల ప్రజలకు అందుబాటులో ఉండేలా హాట్ లైన్ నెంబర్ 8002222 ప్రారంభించింది. కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో ఈ హాట్ లైన్ కాల్ సెంటర్ కార్మికులకు నిరంతరాయంగా సేవలు అందించనుంది. మొత్తం ఐదు భాషల్లో సేవలను అందించేలా ప్రత్యేకంగా ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇంగ్లీష్, అరబిక్, ఉర్దూతో పాటు భారత్, నేపాల్, శ్రీలంకన్లను భాషలను కూడా కవర్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో కాల్ సెంటర్ కు కాంటాక్ట్ అవటం ద్వారా పౌరులకు తగిన సాయం అందించగలమని NHRC పౌర సంబంధాల ప్రధాన అధికారి తెలిపారు. కరోనా మహమ్మారి పరిస్థితుల తర్వాత కూడా NHRC కాల్ సెంటర్ తన సేవలను అందిస్తుందని కూడా ఆయన స్పష్టం చేశారు.
--రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!