మనుషుల స్మగ్లింగ్: ట్రక్ డ్రైవర్ అరెస్ట్
- April 11, 2020
కువైట్: రిఫ్రిజిరేటెడ్ ట్రక్ డ్రైవర్ని పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న డ్రైవర్, 6గురు వ్యక్తుల్ని జిలీబ్ అల్ షుకోయ్ ప్రాంతం నుంచి స్మగుల్ చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు ట్రక్ని ఆపి, అందులో తనిఖీలు నిర్వహించగా, అందులో దాక్కున్న ఆరుగురు వ్యక్తులు బయటపడ్డారు. తనతోపాటే ఆ ఆరుగురు వ్యక్తులు పనిచేస్తున్నట్లు ట్రక్ డ్రైవర్ విచారణలో తెలిపాడు. అయితే, వారి సివిల్ ఐడీలను తనిఖీ చేయగా, వారంతా వేర్వేరు ప్రైవేటు కంపెనీల్లో పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోందనీ, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- సౌదీ దౌత్య శిక్షణ సంస్థ డీజీతో భారత రాయబారి విపుల్ భేటీ
- సీఎం రేవంత్ US టూర్ రద్దు..
- యూట్యూబ్కు పోటీగా చైనా ‘బిలిబిలి’ వచ్చేసింది..
- CBSE–JEE విధానం విద్యార్థుల్లో ఆలోచనా వైవిధ్యాన్ని తగ్గిస్తోంది: బిట్స్ వీసీ రామగోపాల్ రావు
- విశాఖలో బ్రిక్స్ క్రీడా మంత్రుల భేటీ.. భారత్ కీలక ప్రతిపాదనలు
- వాహనాలపై ట్రాఫిక్ జరిమానాలు పేరుకుపోతే చర్యలు తప్పవు: దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- అబుదాబిలో డిసెంబర్ 3 నుంచి ఫార్ములా-1 గ్రాండ్ ప్రిక్స్
- కొలరాడోలో NATS చెస్ టోర్నమెంట్ చక్కటి స్పందన
- ముష్రిఫ్ నేషనల్ పార్క్లో కొత్త బ్రిడ్జి ప్రారంభం..
- బహ్రెయిన్లో లోజ్ పండ్ల ధరలకు రెక్కలు..!!







