మనుషుల స్మగ్లింగ్: ట్రక్ డ్రైవర్ అరెస్ట్
- April 11, 2020కువైట్: రిఫ్రిజిరేటెడ్ ట్రక్ డ్రైవర్ని పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న డ్రైవర్, 6గురు వ్యక్తుల్ని జిలీబ్ అల్ షుకోయ్ ప్రాంతం నుంచి స్మగుల్ చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు ట్రక్ని ఆపి, అందులో తనిఖీలు నిర్వహించగా, అందులో దాక్కున్న ఆరుగురు వ్యక్తులు బయటపడ్డారు. తనతోపాటే ఆ ఆరుగురు వ్యక్తులు పనిచేస్తున్నట్లు ట్రక్ డ్రైవర్ విచారణలో తెలిపాడు. అయితే, వారి సివిల్ ఐడీలను తనిఖీ చేయగా, వారంతా వేర్వేరు ప్రైవేటు కంపెనీల్లో పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోందనీ, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు