LIC ప్రీమియం చెల్లింపుదారులకు శుభవార్త
- April 12, 2020
కరోనా కారణంగా వాయిదాల చెల్లింపు గడువును నెల రోజులు పొడిగిస్తున్నట్లు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) శనివారం ప్రకటించింది. లాక్ డౌన్ కారణంగా పాలసీదారులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీంతో మార్చి, ఏప్రిల్ గడువుల చెల్లింపులకు ఇది వర్తిస్తుందని ఎల్ఐసీ తన ప్రకటనలో తెలిపింది. గ్రేస్ పీరియడ్ మార్చి 22వ తేదీతో ముగిసినా ఏప్రిల్ 15వ తేదీ వరకు అనుమతిస్తున్నట్లు పేర్కొంది.
ఇలా చెల్లింపులు జరపొచ్చు
పొడిగించిన గడువు మేరకు సర్వీస్ చార్జీలు లేకుండానే ఆన్లైన్ ద్వారా కూడా చెల్లింపులు జరపవచ్చునని ఎల్ఐసీ పేర్కొంది. మొబైల్ యాప్ ఎల్ఐసీ పేడైరెక్ట్, నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ఫోన్ పే, పేటీఎం, గూగుల్ పే, భీమ్ యాప్, UPIల ద్వారా చెల్లించవచ్చునని పేర్కొంది. ఐడీబీఐ, యాక్సిస్ బ్యాంకుల వద్ద, కామన్ సర్వీస్ సెంటర్స్ (CSs) ద్వారా ప్రీమియం మొత్తాన్ని చెల్లించవచ్చని తెలిపింది.
కరోనా మరణాలకు పరిహారం..
కరోనా వహమ్మారి కారణంగా మరణించిన పాలసీదారుల సంబంధీకులకు డబ్బులు చెల్లించినట్లు తెలిపింది. కరోనాకు సంబంధించిన మరణాలకు కూడా ప్రస్తుత, కొత్త పాలసీల కింద పరిహారం లభిస్తుందని తెలిపింది. ఈ తరహా క్లెయిమ్స్కు తక్షణ ప్రాతిపదికన పరిహారం చెల్లింపులు చేస్తున్నామని పేర్కొంది. ఇలా 16 క్లెయిమ్స్ ప్రాసెస్ చేశామని వెల్లడించింది.
ఆన్లైన్ ద్వారా ఎల్ఐసీ కొనుగోలుకు 5 పథకాలు
లాక్ డౌన్ సమయంలో ఇంట్లోనే ఆన్ లైన్ ద్వారా కొనుగోలు చేసేందుకు 5 భీమా పథకాలను కూడా అందుబాటులోకి తెచ్చినట్లు ఎల్ఐసీ తెలిపింది. ఎల్ఐసీ టెక్ టర్మ్, జీవన్ సాథీ యాన్యుటీ ప్లాన్, కేన్సర్ కవర్, ఎస్ఐఐపీ, నివేశ్ ప్లస్ తీసుకు వచ్చినట్లు వెల్లడించింది.
అదే దారిలో ఇండియా పోస్ట్
మార్చి, ఏప్రిల్, మే నెలలకు చెల్లించాల్సిన భీమా ప్రీమియంను జూన్ 30వ తేదీ వరకు వాయిదా వేసినట్లు ఇండియా పోస్ట్ తెలిపింది. పెనాల్టీ లేకుండానే చెల్లించవచ్చని పేర్కొంది. వీటిలో పోస్టల్ లైఫ్ న్సూరెన్స్, రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు ఉన్నాయి. రిజిస్టర్డ్ పోర్టల్ ద్వారా కస్టమర్లు ప్రీమియం చెల్లించవచ్చని పేర్కొంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







