జీవితాంతం వారికి రుణపడి ఉంటా:బోరిస్ జాన్సన్
- April 12, 2020
లండన్:తనకు చికిత్స అందించిన వైద్యులకు జీవితాంతం రుణపడి ఉంటానని కరోనా నుంచి కోలుకొని ఐసీయూ నుంచి బయటకు వచ్చిన తర్వాత తన తొలి వ్యాఖ్యల్లో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ పేర్కొన్నారు. వారం రోజుల క్రితం బోరిస్ కరోనా లక్షణాలతో సెంట్రల్ లండన్లోని సెయింట్ థామస్ హాస్పిటల్లో చేరారు. అయితే వ్యాధి లక్షణాలు ఎక్కువకావడంతో ఆయన్ని ఏప్రిల్ 6వ తేదీన ఐసీయూలో ఉంచి చికిత్స అందించి.. ఏప్రిల్ 9వ తేదీన జనరల్ వార్డుకు మార్చారు. శుక్రవారం నాటికి ఆయన స్వయంగా లేచి నడిచారని.. ఆయన ఆరోగ్యం క్రమంగా కుదటపడుతుందని ఆయన అధికారిక కార్యాలయం వెల్లడించింది.
అయితే తనకు వైద్యం అందించిన వాళ్లకి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేనని బోరిస్ అన్నారు. వాళ్లు నాకు చేసిన సేవకు కేవలం ధన్యవాదాలు చెబితే సరిపోదు. నా జీవితాంతం వారికి రుణపడి ఉంటాను అని ఆయన తెలిపారని.. హౌస్ ఆఫ్ పార్లమెంట్ ఒక ప్రకటనలో పేర్కొంది.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







