జీవితాంతం వారికి రుణపడి ఉంటా:బోరిస్ జాన్సన్
- April 12, 2020
లండన్:తనకు చికిత్స అందించిన వైద్యులకు జీవితాంతం రుణపడి ఉంటానని కరోనా నుంచి కోలుకొని ఐసీయూ నుంచి బయటకు వచ్చిన తర్వాత తన తొలి వ్యాఖ్యల్లో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ పేర్కొన్నారు. వారం రోజుల క్రితం బోరిస్ కరోనా లక్షణాలతో సెంట్రల్ లండన్లోని సెయింట్ థామస్ హాస్పిటల్లో చేరారు. అయితే వ్యాధి లక్షణాలు ఎక్కువకావడంతో ఆయన్ని ఏప్రిల్ 6వ తేదీన ఐసీయూలో ఉంచి చికిత్స అందించి.. ఏప్రిల్ 9వ తేదీన జనరల్ వార్డుకు మార్చారు. శుక్రవారం నాటికి ఆయన స్వయంగా లేచి నడిచారని.. ఆయన ఆరోగ్యం క్రమంగా కుదటపడుతుందని ఆయన అధికారిక కార్యాలయం వెల్లడించింది.
అయితే తనకు వైద్యం అందించిన వాళ్లకి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేనని బోరిస్ అన్నారు. వాళ్లు నాకు చేసిన సేవకు కేవలం ధన్యవాదాలు చెబితే సరిపోదు. నా జీవితాంతం వారికి రుణపడి ఉంటాను అని ఆయన తెలిపారని.. హౌస్ ఆఫ్ పార్లమెంట్ ఒక ప్రకటనలో పేర్కొంది.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







