జీవితాంతం వారికి రుణపడి ఉంటా:బోరిస్ జాన్సన్

- April 12, 2020 , by Maagulf
జీవితాంతం వారికి రుణపడి ఉంటా:బోరిస్ జాన్సన్

లండన్:తనకు చికిత్స అందించిన వైద్యులకు జీవితాంతం రుణపడి ఉంటానని కరోనా నుంచి కోలుకొని ఐసీయూ నుంచి బయటకు వచ్చిన తర్వాత తన తొలి వ్యాఖ్యల్లో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ పేర్కొన్నారు. వారం రోజుల క్రితం బోరిస్‌ కరోనా లక్షణాలతో సెంట్రల్ లండన్‌లోని సెయింట్ థామస్ హాస్పిటల్‌లో చేరారు. అయితే వ్యాధి లక్షణాలు ఎక్కువకావడంతో ఆయన్ని ఏప్రిల్ 6వ తేదీన ఐసీయూలో ఉంచి చికిత్స అందించి.. ఏప్రిల్ 9వ తేదీన జనరల్ వార్డుకు మార్చారు. శుక్రవారం నాటికి ఆయన స్వయంగా లేచి నడిచారని.. ఆయన ఆరోగ్యం క్రమంగా కుదటపడుతుందని ఆయన అధికారిక కార్యాలయం వెల్లడించింది.

అయితే తనకు వైద్యం అందించిన వాళ్లకి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేనని బోరిస్ అన్నారు. వాళ్లు నాకు చేసిన సేవకు కేవలం ధన్యవాదాలు చెబితే సరిపోదు. నా జీవితాంతం వారికి రుణపడి ఉంటాను అని ఆయన తెలిపారని.. హౌస్ ఆఫ్ పార్లమెంట్ ఒక ప్రకటనలో పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com