భారత్ దేశ రాష్ట్రాల్లో ఉగ్రముప్పు..
- January 27, 2016
ఈరోజు ఉదయం సమావేశమైన కేంద్రమంత్రి వర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉగ్రవాద ముప్పు పొంచివున్న రాష్ట్రాల్లో భద్రత పెంచాలన్న ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జమ్ముకశ్మీర్తో పాటు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు 17 రిజర్వు బెటాలియన్లు పంపాలని నిర్ణయించింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఏర్పాటయ్యే కేంద్ర ప్రత్యేక బలగాల్లో నియామకాలపై నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ముందు లొంగిపోయిన, ప్రభుత్వానికి సహకరిస్తున్న వారిని నియమించేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. జాతీయ ఎస్సీ ఆర్థికాభివృద్ధి సంస్థ ఆధీకృత మూలధనం వెయ్యికోట్ల నుంచి రూ.1200 కోట్లకు పెంచేందుకు కేంద్రమంత్రి వర్గం ఆమోదముద్ర వేసింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కేంద్రమంత్రులు రాజ్నాథ్సింగ్, అరుణ్జైట్లీ, వెంకయ్యనాయుడు, సుష్మాస్వరాజ్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం









