ముందు జాగ్రత్తలు పాటించని కంపెనీకి జరీమానా
- April 14, 2020
దోహా:మినిస్ట్రీ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ డెవలప్మెంట్, లేబర్ అండ్ సోషల్ ఎఫైర్స్ (ఎంఎడిఎల్ఎస్ఎ), అల్ వహాబ్ ఏరియాలోని ఓ కాంట్రాక్టింగ్ కంపెనీ ఉల్లంఘనలకు పాల్పడినట్లు గుర్తించింది. కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా లేకపోవడం, తగిన భద్రతా చర్యలు పాటించకపోవడంతో కంపెనీపై చర్యలకు ఉపక్రమించారు అధికారులు. సెక్యూరిటీ అథారిటీస్తో కలిసి తగిన చర్యలు సంస్థపై వుంటాయనీ, ప్రస్తుతం సంస్థ ఉల్లంఘనలపై విచారణ జరుగుతోందని చెప్పారు. వర్క్ ప్లేస్లో కార్మికులకి భద్రత వుండాలనీ, కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే క్రమంలో అన్ని చర్యలూ తీసుకోవాల్సిందేనని మినిస్ట్రీ స్పష్టం చేసింది. ఉల్లంఘనలపై ఫిర్యాదు చేసేందుకు హాట్లైన్ నెంబర్ 40280660ను అందుబాటులో వుంది. వర్క్ లేదా అకామడేషన్ వయొలేషన్స్పై ఈ నంబర్కి ఫిర్యాదు చేయొచ్చు.
--రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







