కోవిడ్ 19ః సరిహద్దులో కువైట్ అలర్ట్..ప్రతి వాహనం శానిటైజ్ తర్వాతే అనుమతి
- April 15, 2020
కువైట్:కువైట్ ప్రభుత్వం కరోనా కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. వైరస్ ఉద్ధృతికి అవకాశం ఉండే అన్ని ప్రాంతాల్లో క్రిమి సంహారక (శానిటైజ్) చర్యలు చేపడుతున్నారు. ఇక ఇతర దేశాల నుంచి రోడ్డు మార్గంలో వచ్చే వాహనాలు, ట్రక్కుల విషయంలోనూ కువైట్ ప్రభుత్వం తగిన జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. సరిహద్దులోనే వాటిని శానిటైజ్ (క్రిమి సంహారక చర్య) చేసి ఆ తర్వాతే దేశంలోకి అనుమతి ఇస్తున్నారు. ఇందుకోసం సరిహద్దు చెక్ పోస్టు దగ్గర కువైట్ అగ్నిమాపక శాఖ సరిహద్దులోని చెక్ పోస్టులు, విమానాశ్రయాల దగ్గర క్రిమిసంహారక స్టాండ్లతో జెట్టింగ్ మిషన్లను ఏర్పాటు చేస్తోంది. ప్రతీ వాహనం ఈ క్రిమిసంహారక స్టాండ్ల ద్వారా వెళ్లగానే అందులోనే రసాయనాలతో వాహనం మొత్తాన్ని స్ప్రె చేస్తారు. పూర్తిగా స్ప్రె చేసిన తర్వాత కువైట్ లోకి అనుమతిస్తారు. ఈ మొత్తం ప్రక్రియ అగ్నిమాపక సిబ్బంది పర్యవేక్షణలో జరుగుతుంది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







