కోవిడ్ 19ః సరిహద్దులో కువైట్ అలర్ట్..ప్రతి వాహనం శానిటైజ్ తర్వాతే అనుమతి
- April 15, 2020
కువైట్:కువైట్ ప్రభుత్వం కరోనా కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. వైరస్ ఉద్ధృతికి అవకాశం ఉండే అన్ని ప్రాంతాల్లో క్రిమి సంహారక (శానిటైజ్) చర్యలు చేపడుతున్నారు. ఇక ఇతర దేశాల నుంచి రోడ్డు మార్గంలో వచ్చే వాహనాలు, ట్రక్కుల విషయంలోనూ కువైట్ ప్రభుత్వం తగిన జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. సరిహద్దులోనే వాటిని శానిటైజ్ (క్రిమి సంహారక చర్య) చేసి ఆ తర్వాతే దేశంలోకి అనుమతి ఇస్తున్నారు. ఇందుకోసం సరిహద్దు చెక్ పోస్టు దగ్గర కువైట్ అగ్నిమాపక శాఖ సరిహద్దులోని చెక్ పోస్టులు, విమానాశ్రయాల దగ్గర క్రిమిసంహారక స్టాండ్లతో జెట్టింగ్ మిషన్లను ఏర్పాటు చేస్తోంది. ప్రతీ వాహనం ఈ క్రిమిసంహారక స్టాండ్ల ద్వారా వెళ్లగానే అందులోనే రసాయనాలతో వాహనం మొత్తాన్ని స్ప్రె చేస్తారు. పూర్తిగా స్ప్రె చేసిన తర్వాత కువైట్ లోకి అనుమతిస్తారు. ఈ మొత్తం ప్రక్రియ అగ్నిమాపక సిబ్బంది పర్యవేక్షణలో జరుగుతుంది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్







