పిజ్జా డెలివరీ బాయ్ కు కరోనా! డెలివరీ తీసుకున్న వారి పరిస్థితి ఏంటి?
- April 16, 2020
న్యూఢిల్లీ: ఢిల్లీలోని మాల్వియా నగర్లో ఓ పిజ్జా డెలివరీ బాయ్ కు కరోనా వైరస్ సోకడం కలకలం రేపుతోంది. అతనితో సంబంధం ఉన్న మరో 17 మంది డెలివరీ బాయ్స్, వాళ్లందరూ డెలివరీ ఇచ్చిన వారిని అధికారులు గుర్తిస్తున్నారు. ఇప్పటివరకు 72 మందిని గుర్తించి గృహ నిర్బంధంలో ఉంచినట్టు ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ తెలిపారు. నిర్బంధంలో ఉంచిన వారిలో ఎవరికైనా కరోనా పాజిటివ్ తేలితే వాళ్లను కలిసిన వాళ్లను కూడా క్వారంటైన్ కు తరలిస్తామని సత్యేంద్ర జైన్ పేర్కొన్నారు. సంబంధిత రెస్టారెంట్ చేసిన కొన్ని డెలివరీలు జోమాటో ద్వారా జరిగాయని ఫుడ్ డెలివరీ సర్వీస్ ప్రొవైడర్ జోమాటో ఒక ప్రకటన విడుదల చేసింది. "డెలివరీ సమయంలో రైడర్ సోకినట్లు మాకు తెలియదు" అని జోమాటో స్టేట్ మెంట్ ఇచ్చింది. ఢిల్లీలో ఇప్పటి వరకు కరోనా రోగులు సంఖ్య 1578కి చేరుకోగా 32 మంది మృతి చెందారు. భారత్ దేశంలో 12,760 మంది కరోనా వైరస్ సోకగా 426 మంది మృత్యువాతపడ్డారు. కరోనా వ్యాధి నుంచి 1513 మంది కోలుకున్నారు.
తాజా వార్తలు
- ప్రపంచ మార్కెట్లో ప్రవేశించడానికి ఏపీ గేట్ వేగా ఉంటుంది: సీఎం చంద్రబాబు
- విద్యార్థులకు గుడ్ న్యూస్..స్కూళ్లలోనే ఆధార్ అప్డేట్
- దమాక్ ప్రాపర్టీస్ నుంచి మరో అద్భుతం – 'దమాక్ ఐలాండ్స్ 2' ప్రారంభం
- మస్కట్ లో ఏపీ వాసి మృతి
- ఢిల్లీ బాంబు బ్లాస్ట్ విషయంలో మా సాయం అక్కర్లేదు..మార్కో రూబియో
- డబ్ల్యూటిఐటిసి 2025 కౌంట్డౌన్ పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
- కువైట్ లో ఇద్దరు భారతీయులు మృతి..!!
- జిసిసి 'వన్-స్టాప్' ట్రావెల్ సిస్టమ్ ప్రారంభం..!!
- రియాద్ లో ఆఫాక్ ఆర్ట్స్ అండ్ కల్చర్ అకాడమీ ప్రారంభం..!!
- ‘వన్ ఓషన్, అవర్ ఫ్యూచర్ ’ గ్రాండ్ సక్సెస్..!!







