'APNRT' ని ప్రారంభించిన ఎపి ముఖ్యమంత్రి
- January 27, 2016
ప్రవాస తెలుగువారిని మంచి వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ప్రవాస తెలుగువారిని రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములను చేసే లక్ష్యంతో ఎన్ఆర్టీ పేరుతో ఓ కార్పోరేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. తిరుపతిలోని ఓ హోటల్లో ఎన్ఆర్టీ వెబ్సైట్, యాప్ను ఆయన ఈరోజు ప్రారంభించారు. దీనిలో ప్రపంచవ్యాప్తంగా 97 దేశాల్లో ఉన్న ప్రవాస తెలుగువారు సభ్యులుగా చేరాలని పిలుపునిచ్చారు. పుట్టినగడ్డ రుణం తీర్చుకుంటూ ఆయా గ్రామాలను అభివృద్ధి చేయడానికి సహకారం అందించాలని కోరారు.డా.రవి వేమూరి గారు ప్రసంగిస్తూ మన ఆంధ్రప్రదేశ్ తెలుగు వారందరూ కలిసి మెలిసి పనిచేయాలని కోరుకున్నారు.త్వరలో గల్ఫ్ దేశాలు పర్యటించనున్నారు.
ఈ కార్యక్రమములో ప్రవాస భారతీయులు సుధాకర్ కుదరవల్లి(కువైట్),అనురాధ ఒబ్బిలిశెట్టి(యు.ఎ.ఈ),రాజ శేఖర్(Kuwait NRIs),దివాకర్(TSNV),రెడ్డయ్య చౌదరి(వ్యాపరవేత్త),ప్రసాద్(SkyNet)తదితరులు పాల్గొన్నారు.
--యం.వాసుదేవ రావు (మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)




తాజా వార్తలు
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!









