జెడ్డా:షాపుల్లో పరిశుభ్రతపై జెడ్డా మున్సిపాలిటీ తనిఖీలు
- April 19, 2020
జెడ్డా:కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పరిశుభ్రతకు అధిక ప్రధాన్యం ఇస్తోంది జెడ్డా మున్సిపాలిటీ. మున్సిపాలిటీ పరిధిలోని పలు దుకాణాలు, ఇతర వ్యాపార కేంద్రాల్లో ప్రభుత్వ మార్గనిర్దేశకాల మేరకు పరిశుభ్రత పాటిస్తున్నారా? లేరా? అనేది ఎప్పటికప్పుడు హెల్త్ ఇన్స్ పెక్టర్ ల పర్యవేక్షణలో అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. దాదాపు 1,240 చోట్ల ప్రజా ఆరోగ్య సంరక్షణకు పాటించాల్సిన ప్రమాణాలను ఉల్లంఘించినట్లు అధికారులు గుర్తించారు. వైరస్ ను కట్టడి చేసేందుకు జెడ్డా మున్సిపాలిటీ తమ పరిధిలోని సర్వశక్తులను ఒడ్డి ప్రయత్నాలు చేస్తోంది. అలాగే 419 కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించారు. వైరస్ ను నియంత్రించేందుకు జెడ్డా మున్సిపాలిటీ తన పరిధిలో వీలైనన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తోంది. నగరంలోని పలు పబ్లిక్ ప్రదేశాలు, ప్రభుత్వ భవనాలు, జనసమ్మర్ధ ప్రాంతాల్లో ఎక్కడికక్కడ క్రిమిసంహరక ఛాంబర్లను ఏర్పాటు చేసింది.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







