జెడ్డా:షాపుల్లో పరిశుభ్రతపై జెడ్డా మున్సిపాలిటీ తనిఖీలు
- April 19, 2020
జెడ్డా:కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పరిశుభ్రతకు అధిక ప్రధాన్యం ఇస్తోంది జెడ్డా మున్సిపాలిటీ. మున్సిపాలిటీ పరిధిలోని పలు దుకాణాలు, ఇతర వ్యాపార కేంద్రాల్లో ప్రభుత్వ మార్గనిర్దేశకాల మేరకు పరిశుభ్రత పాటిస్తున్నారా? లేరా? అనేది ఎప్పటికప్పుడు హెల్త్ ఇన్స్ పెక్టర్ ల పర్యవేక్షణలో అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. దాదాపు 1,240 చోట్ల ప్రజా ఆరోగ్య సంరక్షణకు పాటించాల్సిన ప్రమాణాలను ఉల్లంఘించినట్లు అధికారులు గుర్తించారు. వైరస్ ను కట్టడి చేసేందుకు జెడ్డా మున్సిపాలిటీ తమ పరిధిలోని సర్వశక్తులను ఒడ్డి ప్రయత్నాలు చేస్తోంది. అలాగే 419 కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించారు. వైరస్ ను నియంత్రించేందుకు జెడ్డా మున్సిపాలిటీ తన పరిధిలో వీలైనన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తోంది. నగరంలోని పలు పబ్లిక్ ప్రదేశాలు, ప్రభుత్వ భవనాలు, జనసమ్మర్ధ ప్రాంతాల్లో ఎక్కడికక్కడ క్రిమిసంహరక ఛాంబర్లను ఏర్పాటు చేసింది.
తాజా వార్తలు
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!