కరోనా/రస్ అల్ ఖైమా: కార్మికుల రాకపోకలపై షరతులు
- April 19, 2020
యూఏఈ: రస్ అల్ ఖైమా కార్మికులు ఇతర ఎమిరేట్ లకు వెళ్లకుండా నియంత్రణ చర్యలు చేపట్టింది. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా రాస్ అల్ ఖైమా ఎమిరేట్ పరిధిలో మాత్రమే కార్మికులను రవాణా చేయవచ్చని RAK ట్రాన్స్పోర్ట్ అథారిటీ జనరల్ మేనేజర్ ఎస్మాయిల్ హసన్ అల్ బ్లూషి అన్నారు. కార్మికుల, పౌరుల ఆరోగ్య భద్రత తమ లక్ష్యమని వివరించారు. ఒక వేళ ఎవరైనా నిబంధనలను ఖాతరు చేయకుంటే వారిపై జరిమానా విధిస్తామని కూడా ఆయన హెచ్చరించారు. అలాగే కార్మికులు తరలించే సమయంలో రవాణ వాహనంలోని సామార్ధ్యానికి సగానికి మాత్రమే కార్మికులను తీసుకువెళ్లాల్సి ఉంటుంది. కార్మికులు తప్పసరిగా మాస్కులు ధరించటంతో పాటు సామాజిక దూరాన్ని పాటించాలని కూడా బ్లూషి అన్నారు.
కరోనా ను కట్టడి చేయటంలో అబుధాబి, దుబాయ్, షార్జా కూడా ఇదే కోవలో కార్మికుల రాకపోకలపై షరతులు విధించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







