దుబాయ్ : నిబంధనలు పాటించని 19 షాపుల సీజ్..118 షాపు యజమానులకు వార్నింగ్
- May 01, 2020కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా ప్రభుత్వం జారీ చేసిన మార్గనిర్దేశకాలను పాటించని షాపు నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. నిబంధనల అమలు తీరుపై తనిఖీలను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా దుబాయ్ ఆర్ధిక శాఖ విభాగం అధికారులు పలు షాపింగ్ మాల్స్, రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. మాస్కులు, గ్లౌజ్, సామాజిక దూరం పాటించకపోవటం ఇలా పలు నిబంధనలు పాటించని 19 షాపులను సీజ్ చేశారు. మరో 118 షాపు ఓనర్లకు నోటీసుల ద్వారా మందలించారు. లాక్ డౌన్ నిబంధనలు సడలింపు సమయంలోనూ కరోనా వైరస్ కట్టడికి తగిన జాగ్రత్తలు పాటించాలంటూ అధికారులు మార్గనిర్దేశకాలను జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రతి షాపు నిర్వాహకులు మాస్కులు, చేతికి గ్లౌజులు విధిగా ధరించాలి. అలాగే స్టోర్స్ లో కస్టమర్లను గుంపులుగా అనుమతించకుండా సామాజిక దూరాన్ని అమలు చేయాలి. ఈ నిబంధనలు ఎంతవరకు అమలు అవుతున్నాయో పరిశీలించేందుకు ఉదయం నుంచి సాయంత్రం వరకు అధికారులు తనిఖీలు చేపట్టారు. 432 షాపులలో మాత్రం మార్గనిర్దేశకాలను పాటిస్తున్నట్లు గుర్తించామని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈకి భారీ రెయిన్ అలెర్ట్
- ఉమ్రా వీసా వ్యవధిపై సౌదీ కీలక ఉత్తర్వులు
- ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్
- కార్మికులకు కువైట్ శుభవార్త..!
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ