26/11 తరహాలో భారత్లో ఉగ్రదాడులకు కుట్ర!
- May 11, 2020
భారత్లో ఉగ్రదాడులకు లష్కరే తోయిబా ఉగ్రవాదులు కుట్ర చేస్తున్నట్లు సమాచారం. కరోనా వైరస్పై దేశమంతా పోరాడుతున్న విషయం విదితమే. ఈ సమయంలోనే జమ్మూకశ్మీర్తో పాటు ఇతర ప్రాంతాల్లో ఉగ్రవాదులు దాడులు చేయాలని ప్రణాళిక రచించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్ దావూద్ ఇబ్రహీంతో లష్కరే తోయిబా ఉగ్రవాదులు చేతులు కలిపినట్లు సమాచారం. ఆదివారం రోజు ఇస్లామాబాద్లోని ఫామ్హౌస్లో దావూద్ ఇబ్రహీంతో.. పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ సహాయంతో.. లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ ప్రతినిధులు సమావేశమైనట్లు తెలిసింది. ప్రస్తుతం భారత్లో కరోనా వైరస్ను తుదముట్టించే పనిలో అందరూ నిమగ్నమయ్యారు.. ఇప్పుడే దాడులు చేసేందుకు సరైన సమయని ఐఎస్ఐ భావించినట్లు సమాచారం.
కశ్మీర్ వ్యాలీలో ఉగ్రవాద దాడులు చోటు చేసుకునే అవకాశం ఉందని వార్తలు వచ్చిన నేపథ్యంలో సోమవారం పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. హంద్వారాలో ముగ్గురు జవాన్ల మృతికి తామే బాధ్యులమని టీఆర్ఎఫ్(ది రెసిస్టెన్స్ ఫ్రంట్) ఉగ్రవాద సంస్థ ప్రకటించిన విషయం విదితమే.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







