యూఏఈ:అడ్డదిడ్డంగా పార్కింగ్ చేస్తే జరిమానాలు..
- May 15, 2020
యూఏఈ:పార్కింగ్ ఫీజుల నుంచి ప్రజలకు మినహాయింపులు ఇచ్చినా..అబుధాబి వాహనదారులు రోడ్లపై అడ్డదిడ్డంగానే వాహనాలను పార్క్ చేస్తున్నారు. పార్కింగ్ స్థలాల్లో ఓ పద్దతిగా పార్కింగ్ చేసే అవకాశాలు ఉన్నా..అవేం పట్టించుకోకుండా రోడ్ల పక్కనే వాహనాలను పార్క్ చేస్తూ తోటి వాహనదారులను ఇబ్బందుల పాలు చేస్తున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఆర్ధిక ఒడిదుడుకులు ఎదుర్కుంటున్న ప్రజలకు పార్కింగ్ ఫీజులను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఫీజులు రద్దు చేసినా..పార్కింగ్ సర్వీసులను వాహనదారులు దుర్వినియోగం చేస్తున్నారని అబుధాబి మున్సిపాలిటిలోని సమీకృత రవాణా కేంద్రం అధికారులు అంటున్నారు. ఇక నుంచి అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పార్కింగ్ నిబంధనలు ఉల్లంఘిస్తే భారీగా జరిమానా విధిస్తామని తెలిపారు. నిషేధిత ప్రాంతంలో పార్క్ చేసినా, వాహనాల వెనక, ముందు భాగంలో కార్లను నిలిపినా, డబుల్ పార్కింగ్ చేసినా జరిమానా తప్పదని వార్నింగ్ ఇస్తున్నారు. నిర్ణీత పార్కింగ్ ప్రదేశాల్లో ఓ క్రమపద్దతిలో వాహనాలను పార్క్ చేసుకుంటే అందరికీ ఉపయుక్తంగా ఉంటుందన్నారు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







