కరోనా వైరస్ ఇంపాక్ట్: ఎతిహాద్ ఎయిర్వేస్లో ఉద్యోగుల ‘లే ఆఫ్’
- May 20, 2020
అబుధాబి:ఎతిహాద్ ఎయిర్వేస్, తమ సంస్థకు సంబంధించిన పలు యూనిట్స్లో ఉద్యోగులకు ‘లే ఆఫ్’(తీసివేయుట)ప్రకటించింది. కరోనా వైరస్ నేపథ్యంలో ఎయిర్ ట్రావెల్ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన దరిమిలా ఈ నిర్ణయం తీసుకుంది. తమ వర్క్ ఫోర్స్ విషయంలో చాలా గర్వంగా ఫీలవుతున్నామనీ, అయితే ప్రత్యేక పరిస్థితుల్లో ఉద్యోగులకు లే ఆఫ్ ప్రకటించాల్సి వస్తోందని ఎతిహాస్ అధికార ప్రతినిది¸ ఒకరు చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో నెలకొన్న పరిస్థితుల కారణంగా తమ విమానాల రాకపోకలు నిలిచిపోయాయనీ, ప్రత్యేక విమానాల్ని మాత్రం నడుపుతున్నామని సంస్థ పేర్కొంది. గత ఏడాది 20,500 మందికి ఉద్యోగాలు కల్పించిన సంస్థ, ఈ ఏడాది వందలాది మందిని తొలగించాల్సి వచ్చింది. వీరిలో క్యాబిన్ క్రూ మెంబర్స్ కడూఆ వున్నారు. మరిన్ని ఉద్యోగాల తొలగింపు కూడా తప్పకపోవచ్చునని సంస్థ చెబుతోంది. అయితే, భవిష్యత్తుపై ఆశతో వున్నామని అంటోంది ఎతిహాద్.
--ప్రదీప్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







