కరోనా వైరస్ ఇంపాక్ట్: ఎతిహాద్ ఎయిర్వేస్లో ఉద్యోగుల ‘లే ఆఫ్’
- May 20, 2020
అబుధాబి:ఎతిహాద్ ఎయిర్వేస్, తమ సంస్థకు సంబంధించిన పలు యూనిట్స్లో ఉద్యోగులకు ‘లే ఆఫ్’(తీసివేయుట)ప్రకటించింది. కరోనా వైరస్ నేపథ్యంలో ఎయిర్ ట్రావెల్ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన దరిమిలా ఈ నిర్ణయం తీసుకుంది. తమ వర్క్ ఫోర్స్ విషయంలో చాలా గర్వంగా ఫీలవుతున్నామనీ, అయితే ప్రత్యేక పరిస్థితుల్లో ఉద్యోగులకు లే ఆఫ్ ప్రకటించాల్సి వస్తోందని ఎతిహాస్ అధికార ప్రతినిది¸ ఒకరు చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో నెలకొన్న పరిస్థితుల కారణంగా తమ విమానాల రాకపోకలు నిలిచిపోయాయనీ, ప్రత్యేక విమానాల్ని మాత్రం నడుపుతున్నామని సంస్థ పేర్కొంది. గత ఏడాది 20,500 మందికి ఉద్యోగాలు కల్పించిన సంస్థ, ఈ ఏడాది వందలాది మందిని తొలగించాల్సి వచ్చింది. వీరిలో క్యాబిన్ క్రూ మెంబర్స్ కడూఆ వున్నారు. మరిన్ని ఉద్యోగాల తొలగింపు కూడా తప్పకపోవచ్చునని సంస్థ చెబుతోంది. అయితే, భవిష్యత్తుపై ఆశతో వున్నామని అంటోంది ఎతిహాద్.
--ప్రదీప్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







