కరోనా వైరస్ ఇంపాక్ట్: ఎతిహాద్ ఎయిర్వేస్లో ఉద్యోగుల ‘లే ఆఫ్’
- May 20, 2020
అబుధాబి:ఎతిహాద్ ఎయిర్వేస్, తమ సంస్థకు సంబంధించిన పలు యూనిట్స్లో ఉద్యోగులకు ‘లే ఆఫ్’(తీసివేయుట)ప్రకటించింది. కరోనా వైరస్ నేపథ్యంలో ఎయిర్ ట్రావెల్ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన దరిమిలా ఈ నిర్ణయం తీసుకుంది. తమ వర్క్ ఫోర్స్ విషయంలో చాలా గర్వంగా ఫీలవుతున్నామనీ, అయితే ప్రత్యేక పరిస్థితుల్లో ఉద్యోగులకు లే ఆఫ్ ప్రకటించాల్సి వస్తోందని ఎతిహాస్ అధికార ప్రతినిది¸ ఒకరు చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో నెలకొన్న పరిస్థితుల కారణంగా తమ విమానాల రాకపోకలు నిలిచిపోయాయనీ, ప్రత్యేక విమానాల్ని మాత్రం నడుపుతున్నామని సంస్థ పేర్కొంది. గత ఏడాది 20,500 మందికి ఉద్యోగాలు కల్పించిన సంస్థ, ఈ ఏడాది వందలాది మందిని తొలగించాల్సి వచ్చింది. వీరిలో క్యాబిన్ క్రూ మెంబర్స్ కడూఆ వున్నారు. మరిన్ని ఉద్యోగాల తొలగింపు కూడా తప్పకపోవచ్చునని సంస్థ చెబుతోంది. అయితే, భవిష్యత్తుపై ఆశతో వున్నామని అంటోంది ఎతిహాద్.
--ప్రదీప్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







