కువైట్ నుంచి విజయవాడ బయల్దేరిన విమానం

- May 21, 2020 , by Maagulf
కువైట్ నుంచి విజయవాడ బయల్దేరిన విమానం

కువైట్:కువైట్ ప్రభుత్వం ప్రకటించిన ఆమ్నెస్టీ కార్యక్రమం క్రింద ఏపీ వలస కార్మికులతో  విమానం ఈ రోజు కువైట్ నుండి సాయంత్రం 4.10 గంటలకు విజయవాడకు చేరుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర  ముఖ్యమంత్రి  మరియు ఎంపీల నుండి విదేశాంగ మంత్రి జై శంకర్ కి  పదే పదే ఇమెయిల్స్ పంపడంతో, ఫలితంగా మొత్తం 145 మంది ప్రయాణికులతో  మొదటి విమానం  కువైట్ నుండి బయల్దేరింది. స్టేట్ కోవిడ్-19 నోడల్ టీం యొక్క జిల్లా రిసెప్షన్ బృందాలు విమానాశ్రయంలో ఈ వలస కార్మికులను రిసీవ్ చేసుకుంటాయి.వారిని తప్పనిసరి క్వారంటైన్ కు  పంపించడానికి అవసరమైన ఏర్పాట్లు చేశాయి.రాబోయే రోజుల్లో ఆమ్నెస్టీ కింద ఉన్న వలస కార్మికులతో ఆంధ్రప్రదేశ్ కు రాబోతున్న అనేక  విమానాలలో ఇది మొదటిది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com