వెంకీ రానా హీరోలుగా మల్టీస్టార్రర్..మలయాళం చిత్రం రీమేక్
- May 27, 2020
మలయాళ సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పన్ కోషియమ్’కు సంబందించిన తెలుగు రీమేక్ రైట్స్ను సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ దక్కించుకున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఈ సినిమాను తెలుగులో బాలయ్య, రానా ప్రధాన పాత్రల్లో నిర్మించాలని భావించారు. అయితే ఏవో కారణాల వల్ల బాలయ్య ఈ సినిమాలో నటించడంపై ఆసక్తి చూపించలేదట. దీంతో బాలయ్య పాత్రలో వెంకటేష్ ను తీసుకోవాలని చిత్రబృందం ఆలోచిస్తునట్లు తాజా సమాచారం. అంతేకాదు ఈ రీమేక్లో నటించడానికి ఇప్పటికే వెంకటేష్, రానాలు ఇంట్రస్ట్ గా ఉన్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా ఒరిజినల్ వర్షన్ గురించి మాట్లాడితే.. అయ్యప్పన్ కోషియమ్లో పోలీస్ క్యారెక్టర్ చేసిన బిజూ మీనన్ పాత్రలో తెలుగులో వెంకటేష్ చేయనున్నాడు. పృథ్విరాజ్ పాత్రలో రానా నటిస్తాడని తెలుస్తోంది. ఈ సినిమా గురించి పూర్తి వివరాలను, సినిమాలో పనిచేసే మిగితా టెక్నికల్ సిబ్బంది గురించి తెలుగు రీమేక్ హక్కులన నిర్మాత సూర్య దేవర నాగవంశీ సొంతం అతి త్వరలో వెల్లడించనున్నాడు. సూర్య దేవర నాగవంశీ ప్రస్తుతం రంగ్ దే చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. నితిన్ హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్గా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నాడు.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







