తెలంగాణలో కొత్తగా 117 కరోనా పాజిటివ్ కేసులు
- May 28, 2020హైదరాబాద్:తెలంగాణలో 117 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,216 కి చేరింది. గడిచిన 24 గంటల్లో నలుగురు కరోనా బాధితులు మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 67కు చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో తెలంగాణకు చెందినవారు 66 మంది, వలసదారులు ఇద్దరు, విదేశాల నుంచి వచ్చిన వారిలో 49 మంది ఉన్నారని ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ మేరకు ఆయన గురువారం రాత్రి హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఇప్పటివరకు 1345 మంది డిశ్చార్జి అయ్యారని వివరించారు. ప్రస్తుతం 844 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు