భారత్:24గంటల్లో 7,466 కరోనా కేసులు..
- May 29, 2020భారతదేశంలో గత 24 గంటల్లో 7,466 కొత్త కేసులు నమోదయ్యాయి. దేశంలో ఇన్ని ఎక్కువ కేసులు ఒకేరోజు నమోదవడం ఇదే తొలిసారి. భారతదేశంలో కరోనావైరస్ కేసుల సంఖ్య శుక్రవారం నాటికి 1.65 లక్షలకు చేరుకుంది. ఇప్పటివరకు అతిపెద్ద జంప్ ఇదే. ఈ మేరకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మహారాష్ట్రలో గత 24 గంటల్లో కొత్తగా 2,190కేసులు నమోదయ్యాయి.
COVID-19కు సంబంధించిన మరణాల సంఖ్య 4,706 చేరుకుంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 71,105 మంది కోలుకున్నారు. గత 24 గంటల్లో 175 మరణాలు చోటుచేసుకోగా.. దేశంలో చికిత్స పొందుతున్న కరోనావైరస్ రోగుల సంఖ్య 89,987గా ఉంది.
మహారాష్ట్ర తరువాత, తమిళనాడులో అత్యధిక కరోనావైరస్ కేసులు వచ్చాయి. తమిళనాడు, ఢిల్లీ రాష్ట్రాల్లో రోజురోజుకు ఈ మహమ్మారి తీవ్రత పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా వైరస్ తీవ్రత అధికంగా ఉన్న దేశాల్లో భారత్ తొమ్మిదవ స్థానంలో కొనసాగుతుంది.
ప్రపంచవ్యాప్తంగా 59 లక్షలకు పైగా ప్రజలకు కరోనా సోకగా.. ప్రపంచంలోని అన్ని ప్రాంతాలకు వ్యాపించింది. ప్రపంచవ్యాప్తంగా 3.5 లక్షలకు పైగా చనిపోయారు.
తాజా వార్తలు
- ఏపీలో భానుడి విశ్వరూపం, బెంబేలెత్తిపోతున్న జనం
- వైసీపీ మేనిఫెస్టో ఫై ప్రశ్నల అస్త్రాలను సంధిస్తున్న నెటిజన్లు
- ఎన్నికల ప్రచారంలో హీరో వెంకటేశ్..?!!
- ఖతార్ విమానయాన రంగం.. అద్భుతమైన వృద్ధి..!
- సలాలా ఆటిజం సెంటర్.. ఆటిస్టిక్ పిల్లలకు వరం..!
- కాలువల్లో చనిపోయిన చేపలు.. మున్సిపాలిటీ క్లారిటీ
- యాంటీబయాటిక్స్ నిల్..పుకార్లను నమ్మొద్దు
- 15 ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదు.. అలర్ట్ జారీ
- 'రామాయణం' షూటింగ్ సెట్ నుంచి రణబీర్ కపూర్, సాయి పల్లవి ఫోటోలు లీక్..
- ముంబైలో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు..కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం