వలస కార్మికులకు అండగా NRI ల ప్రవాస హస్తం

- May 29, 2020 , by Maagulf
వలస కార్మికులకు  అండగా NRI ల ప్రవాస హస్తం

హైదరాబాద్:టీపీసీసీ  పిలుపు  మేరకు వివిధ  దేశాలకు  చెందిన  ఇండియన్ ఓవర్సీస్  కాంగ్రెస్  తెలంగాణ చాఫ్టర్- టీపీసీసీ  ఎన్నారై  సెల్  ఆధ్వర్యంలో  తెలంగాణ  నుండి  వివిధ  రాష్ట్రాలకు  చెందిన    వలస  కార్మికుల్ని వారి వారి  రాష్ట్రాల స్వస్థలం  చేర్చుటకు   ముందుకు  వచ్చారు. 

మే 28 వ తేదీ గురువారం  సాయంత్రం  4 గం  లకు గాంధీ భవన్ లో  టీపీసీసీ  అధ్యక్షులు ఉత్తమ్  కుమార్  రెడ్డి  బస్సు ప్రయాణాన్ని  జెండా  ఊపి   ప్రారంభించారు. 

హైదరాబాద్ నుండి   ఒరిస్సా( mayurbhanj )కి  బస్సు  బయలు దేరింది. 

బస్సు కి  సంబంధించి  అన్ని  ప్రభుత్వ అనుమతులు, ప్రయాణ సౌకర్యాలు  దాసోజు  శ్రవణ్, బి  ఎమ్  వినోద్  కుమార్  చూసారు. 

బస్సు  ఏర్పాటు కు  సహకరించిన  NRI  లు 

1) గంప  వేణుగోపాల్  - లండన్
2) గంగసాని  రాజేశ్వర్  రెడ్డి  - USA
3)యర్రంరెడ్డి  తిరుపతి  రెడ్డి  - USA
4)మన్యం  రాజశేఖర్ రెడ్డి  - ఆస్ట్రేలియా
5) ఎస్  వి  రెడ్డి  - దుబాయ్
  6)ప్రదీప్ సామల  - USA
7) గంగసాని ప్రవీణ్  రెడ్డి  -లండన్
8) రవీందర్  గౌడ్  - కెనడా
9) కొత్త రామ్మోహన్  రెడ్డి  - లండన్
10) సుధాకర్  గౌడ్  - లండన్
11)బిక్కుమండ్ల  రాకేష్  -లండన్
12) నీలా  శ్రీధర్  - లండన్
13)పోటాటి  శ్రీకాంత్  రెడ్డి  -లండన్

కాంగ్రెస్  పార్టీ  తరపున  యూకే, ఆస్ట్రేలియా, దుబాయ్  లలో  ఇబ్బందుల్లో  ఉన్న  విద్యార్థులకు, కార్మికులకు వసతి కల్పించడం  నిత్యావసర సరుకులు ఇవ్వడం,భోజనాలు  అందచేయడం కట్టడం వంటి  కార్యక్రమాలు  చేబట్టడం  జరిగింది.  వీటితో  పాటు  ప్రభుత్వ అనాలోచిత  ముందస్తు  ప్రణాళిక  లేకపోవడం  వల్ల  వలస  కార్మికులకు  ఏర్పడ్డ సమస్యలు  తీర్చడంలో  ఎన్నారై  లు  ముందుకు  రావడాన్ని  ఇండియన్ ఓవర్సీస్  కాంగ్రెస్ ,  తెలంగాణ  ప్రదేశ్  కాంగ్రెస్  అందరూ కూడా పెద్ద ఎత్తున  హర్షం  తెలియచేస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com