సూర్య, కార్తీ మల్టీ స్టారర్ చిత్రం..!
- May 29, 2020ప్రస్తుతం మల్టీస్టారర్ చిత్రాలకి మంచి క్రేజ్ ఉంది. ఇద్దరు హీరోలు ఒకే తెరపై కనిపిస్తే అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు. అదే ఆ ఇద్దరు హీరోలు ఒకే ఫ్యామిలీకి చెందిన స్టార్స్ అయితే ఇక బాక్సాఫీస్ బద్దలవడం ఖాయం అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండస్ట్రీలో ఇలాంటి ప్రయత్నాలు చేసేందుకు కసరత్తులు జరుగుతుండగా, తాజాగా సూర్య,కార్తీ కాంబినేషన్లో సినిమా రెడీ అయినట్టు తెలుస్తుంది.
పృథ్వీ -బిజూ మీనన్ కాంబినేషన్ లో ఇటీవలే వచ్చిన మలయాళ సినిమా 'అయ్యప్పనుమ్ కోశియుమ్'. అక్కడ మంచి విజయం సాధించిన ఈ సినిమానే తమిళ్లో రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు ప్రముఖ నిర్మాత కథిరెన్. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ రీమేక్ లోనే సూర్య, కార్తీ నటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మరి ఈ వార్తలు కనుక నిజం అయితే అభిమానులకి కనుల పండుగే అని చెప్పవచ్చు. మరి దీనికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి. కాగా, ఇటీవల సూర్య సతీమణి జ్యోతిక, కార్తీ కలిసి తంబీ అనే తమిళ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు