10,000 మంది పేదలకు నిత్యావసర సరుకులు అందజేసిన జగపతి బాబు
- May 30, 2020
హైదరాబాద్:కరోన వ్యాప్తి నిర్మూలనలో భాగంగా విధించిన లాక్డౌన్ వల్ల దినసరి వేతనం పొందే ఎంతో మంది సినీ కార్మికులు, పేదలు నిత్యావసరాల కోసం ఇబ్బందులు పడుతున్నారు. సినీ ప్రముఖులు, వ్యాపార వేత్తలు వారికి తమ వంతు సాయం చేస్తున్నారు. ఇటీవల విలక్షణ నటుడు జగపతిబాబు చాలా మంది సినీ కార్మికులకు తనే స్వయంగా బియ్యం, పప్పులు, వంట నూనె తదితర నిత్యావసరాలను అందించారు. అలాగే కరోనా కట్టడిలో భాగంగా లాక్డౌన్ని పకడ్భందీగా నిర్వహిస్తున్న పోలీసులకి గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్లో సీపీ వి.సి.సజ్జనార్ను కలిసి ఎన్–95 మాస్కులు, శానిటైజర్లను అందించిన విషయం తెలిసిందే. ఇవే కాకుండా ఇటీవల ఇబ్బందులలో ఉన్న పదివేల మంది పేదలకి నిత్యావసర సరుకులు, మాస్కులు, శానిటైజర్లను అందజేశారు అని తెలిసింది. ఇదే విషయాన్ని జగపతి బాబుని అడగగా `` సహాయం చేసిన మాట వాస్తవమే కాని చేసిన ప్రతి సహాయం అందరికీ తెలియాల్సిన అవసరం లేదు కదా... ఆపదలో ఉన్న వారికి సహాయం చేశాను` అని ఎంతో సింపుల్గా, హంబుల్గా చెప్పారు.
జగపతిబాబు తండ్రి ప్రముఖ దర్శక నిర్మాత వి.బి. రాజేంద్రప్రసాద్ కూడా ఎన్నో గుప్తదానాలు చేసేవారు. ఫ్యామిలీ చిత్రాల హీరోగా అందరి ఆదరాభిమానాల్ని అందుకున్న జగపతి బాబు కష్టాల్లో ఫ్యామిలీస్ ని ఆదుకోవడం ఎంతయినా అభినందించాల్సిన విషయం.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







