భారత్:జూన్ 30వరకు లాక్ డౌన్ పొడిగింపు

- May 30, 2020 , by Maagulf
భారత్:జూన్ 30వరకు లాక్ డౌన్ పొడిగింపు

న్యూ ఢిల్లీ:భారత దేశవ్యాప్తంగా లాక్ డౌన్‌ను పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈసారి లాక్ డౌన్ 5.0ను 30 రోజుల పాటు పొడిగించింది.కంటైన్‌మెంట్‌ జోన్లలో జూన్ 1 నుంచి జూన్ 30వ తేదీ వరకు లాక్ డౌన్‌ను పొడిగిస్తున్నట్టు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అలాగే, లాక్ డైన్ 5లో ప్రజలకు కొత్త మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. జూన్ 8 నుంచి అన్ని రాష్ట్రాల్లో ఆలయాలు, ప్రార్థనా స్థలాలు తెరుచుకోవచ్చని తెలిసింది.జూలై నుంచి పాఠశాలలు, కాలేజీలు, కోచింగ్‌ సెంటర్లు ప్రారంభం అవుతాయని కేంద్రం తన మార్గదర్శకాల్లో పేర్కొంది. లాక్‌డౌక్‌ కారణంగా రెండు నెలలుగా మూతబడ్డ అంతర్జాతీయ విమాన సర్వీసులు, మెట్రో రైళ్లు. సినిమా హాల్స్‌, జిమ్‌లు, బార్లు, స్విమ్మింగ్ పూల్స్‌, ఆడిటోరియంల ప్రారంభంపై త్వరలోనే తేదీలను ప్రకటిస్తామని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. అలాగే రాజకీయ, సామాజిక, సాంస్కృతిక మతపరమైన కార్యకలాపాలపై కూడా త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తామని తెలిపింది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 వరకు కర్ఫ్యూ కొనసాగుందని కేంద్రం స్పష్టం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com