భారత్:జూన్ 30వరకు లాక్ డౌన్ పొడిగింపు
- May 30, 2020న్యూ ఢిల్లీ:భారత దేశవ్యాప్తంగా లాక్ డౌన్ను పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈసారి లాక్ డౌన్ 5.0ను 30 రోజుల పాటు పొడిగించింది.కంటైన్మెంట్ జోన్లలో జూన్ 1 నుంచి జూన్ 30వ తేదీ వరకు లాక్ డౌన్ను పొడిగిస్తున్నట్టు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అలాగే, లాక్ డైన్ 5లో ప్రజలకు కొత్త మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. జూన్ 8 నుంచి అన్ని రాష్ట్రాల్లో ఆలయాలు, ప్రార్థనా స్థలాలు తెరుచుకోవచ్చని తెలిసింది.జూలై నుంచి పాఠశాలలు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లు ప్రారంభం అవుతాయని కేంద్రం తన మార్గదర్శకాల్లో పేర్కొంది. లాక్డౌక్ కారణంగా రెండు నెలలుగా మూతబడ్డ అంతర్జాతీయ విమాన సర్వీసులు, మెట్రో రైళ్లు. సినిమా హాల్స్, జిమ్లు, బార్లు, స్విమ్మింగ్ పూల్స్, ఆడిటోరియంల ప్రారంభంపై త్వరలోనే తేదీలను ప్రకటిస్తామని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. అలాగే రాజకీయ, సామాజిక, సాంస్కృతిక మతపరమైన కార్యకలాపాలపై కూడా త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తామని తెలిపింది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 వరకు కర్ఫ్యూ కొనసాగుందని కేంద్రం స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- బెంగళూరుతో సన్రైజర్స్ మ్యాచ్..
- భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
- ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనలు ఖరారు..!
- మరోసారి బహిరంగ క్షమాపణలు తెలిపిన రాందేవ్ బాబా
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్
- తెలంగాణలో భానుడి భగభగలు..వడదెబ్బతో ముగ్గురి మృతి
- తెలంగాణలో ఇంటర్ ఫలితాలు విడుదల
- 33,350 టయోటా ల్యాండ్ క్రూయిజర్, లెక్సస్ కార్ల రీకాల్
- నేపాల్ అధ్యక్షుడితో అమీర్ భేటీ
- పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్న దుబాయ్ ఎయిర్ పోర్ట్స్