తెలంగాణలో కొత్తగా 199 కరోనా పాజిటివ్ కేసులు
- May 31, 2020హైదరాబాద్:తెలంగాణలో కొత్తగా 199 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. GHMC పరిధిలోనే గడిచిన 24 గంటల్లో 122 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. రంగారెడ్డిలో 40, మేడ్చల్లో 10, ఖమ్మంలో 9, మహబూబ్నగర్, జగిత్యాల, మెదక్లో 3 చొప్పున కరోనా కేసులు నమోదు కాగా వరంగల్ అర్బన్లో 2, సూర్యాపేట, నిర్మల్, యాదాద్రి, జనగాంలో ఒక్కో కేసు నమోదు అయింది. కొత్తగా ముగ్గురు వలస కార్మికులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇప్పటివరకూ 2,698 మందికి కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 1428 మంది డిశ్చార్జ్ అయ్యారు. 1,188 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తెలంగాణలో ఆదివారం కరోనాతో ఐదుగురు మృతి చెందారు. ఇప్పటివరకూ మొత్తం 82 మంది మృతి చెందారు. ఈ మేరకు తెలంగాణ వైద్యారోగ్య శాఖ తెలిపింది.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- బీచ్లు, పబ్లిక్ పార్కులు, మార్కెట్లు మూసివేత
- కువైట్లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!
- కోవిడ్ సర్టిఫికేట్ నుంచి ప్రధాని మోడీ ఫొటో తొలగింపు
- అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో ముగ్గురు అరెస్ట్
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
- పోలింగ్ సమయాన్ని పెంచిన కేంద్ర ఎన్నికల సంఘం
- తెలంగాణలో ఎన్నికల ప్రచారంకు రాహుల్, ప్రియాంక..
- ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..!
- ప్రయాణికులకు దుబాయ్ ఎయిర్పోర్ట్స్, విమానయాన సంస్థలు కీలక సూచనలు..!
- ఒమన్ లో కీలకమైన యునెస్కో, అరబ్ ప్రతినిధుల సమావేశం