తెలంగాణలో కొత్తగా 199 కరోనా పాజిటివ్‌ కేసులు

- May 31, 2020 , by Maagulf
తెలంగాణలో కొత్తగా 199 కరోనా పాజిటివ్‌ కేసులు

హైదరాబాద్:తెలంగాణలో కొత్తగా 199 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. GHMC పరిధిలోనే గడిచిన 24 గంటల్లో 122 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. రంగారెడ్డిలో 40, మేడ్చల్‌లో 10, ఖమ్మంలో 9, మహబూబ్‌నగర్‌, జగిత్యాల, మెదక్‌లో 3 చొప్పున కరోనా కేసులు నమోదు కాగా వరంగల్‌ అర్బన్‌లో 2, సూర్యాపేట, నిర్మల్‌, యాదాద్రి, జనగాంలో ఒక్కో కేసు నమోదు అయింది. కొత్తగా ముగ్గురు వలస కార్మికులకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఇప్పటివరకూ 2,698 మందికి కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. 1428 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. 1,188 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. తెలంగాణలో ఆదివారం కరోనాతో ఐదుగురు మృతి చెందారు. ఇప్పటివరకూ మొత్తం 82 మంది మృతి చెందారు. ఈ మేరకు తెలంగాణ వైద్యారోగ్య శాఖ తెలిపింది.

--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com