కువైట్:కరోనా ఫ్రంట్ లైన్ వర్కర్స్ 50 వేల ఫ్రీ టికెట్లు..జజీరా ఎయిర్ వేస్ ఆఫర్
- June 03, 2020
కువైట్:కరోనాపై పోరాడుతున్న ఫ్రంట్ లైన్ వర్కర్స్ కి కువైట్ ప్రైవేట్ ఎయిర్ వేస్ జజీరా ఆఫర్ ప్రకటించింది. వారు చేసిన సేవలకు గుర్తింపుగా ఉచితంగా 50 వేల టికెట్లను కేటాయించనున్నట్లు ప్రకటించింది. జజీరా ఎయిర్ వేస్ సర్వీసుల్లో వారు ఎక్కడికైనా వెళ్లేందుకు వెసులుబాటు కల్పించింది. వచ్చే ఏడాది చివరి వరకల్లా ఈ ఆఫర్ ను వినియోగంచుకోవచ్చని జజీరా ప్రకటించింది. కరోనాపై పోరాడి దేశ ప్రజలను రక్షించటంలో కీలక పాత్ర పోషిస్తున్న ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఉచిత ప్రయాణ అవకాశాన్ని కల్పించటం తమకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు జజీరా ఎయిర్ వేస్ చైర్మన్ మర్వన్ బూదై అభిప్రాయపడ్డారు. అయితే...కువైట్ ప్రభుత్వం ఎంపిక చేసిన ఫ్రంట్ లైన్ వర్కర్స్ మాత్రమే ఫ్రీ టికెట్లను కేటాయించనుంది. ప్రస్తుతం కమర్షియల్ ఫ్లైట్ సర్వీసులపై నిషేధం కొనసాగుతోందని, సర్వీసులు పునరిద్ధరించగానే టికెట్లను వినియోగంచుకోవచ్చని కూడా మర్వన్ స్పష్టం చేశారు. ఇదిలాఉంటే జజీరా ఎయిర్ వేస్ ప్రస్తుతం విదేశాల్లో చిక్కుకుపోయిన కువైటీయన్లను స్వదేశానికి తీసుకువచ్చేందుకు సర్వీసులను నడుపుతున్న విషయం తెలిసిందే.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







