కువైట్:కరోనా ఫ్రంట్ లైన్ వర్కర్స్ 50 వేల ఫ్రీ టికెట్లు..జజీరా ఎయిర్ వేస్ ఆఫర్
- June 03, 2020
కువైట్:కరోనాపై పోరాడుతున్న ఫ్రంట్ లైన్ వర్కర్స్ కి కువైట్ ప్రైవేట్ ఎయిర్ వేస్ జజీరా ఆఫర్ ప్రకటించింది. వారు చేసిన సేవలకు గుర్తింపుగా ఉచితంగా 50 వేల టికెట్లను కేటాయించనున్నట్లు ప్రకటించింది. జజీరా ఎయిర్ వేస్ సర్వీసుల్లో వారు ఎక్కడికైనా వెళ్లేందుకు వెసులుబాటు కల్పించింది. వచ్చే ఏడాది చివరి వరకల్లా ఈ ఆఫర్ ను వినియోగంచుకోవచ్చని జజీరా ప్రకటించింది. కరోనాపై పోరాడి దేశ ప్రజలను రక్షించటంలో కీలక పాత్ర పోషిస్తున్న ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఉచిత ప్రయాణ అవకాశాన్ని కల్పించటం తమకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు జజీరా ఎయిర్ వేస్ చైర్మన్ మర్వన్ బూదై అభిప్రాయపడ్డారు. అయితే...కువైట్ ప్రభుత్వం ఎంపిక చేసిన ఫ్రంట్ లైన్ వర్కర్స్ మాత్రమే ఫ్రీ టికెట్లను కేటాయించనుంది. ప్రస్తుతం కమర్షియల్ ఫ్లైట్ సర్వీసులపై నిషేధం కొనసాగుతోందని, సర్వీసులు పునరిద్ధరించగానే టికెట్లను వినియోగంచుకోవచ్చని కూడా మర్వన్ స్పష్టం చేశారు. ఇదిలాఉంటే జజీరా ఎయిర్ వేస్ ప్రస్తుతం విదేశాల్లో చిక్కుకుపోయిన కువైటీయన్లను స్వదేశానికి తీసుకువచ్చేందుకు సర్వీసులను నడుపుతున్న విషయం తెలిసిందే.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు