వచ్చే ఐదేళ్లల్లో మరో రెండు థీమ్ పార్కు లు..
- January 31, 2016
వచ్చే ఐదేళ్లల్లో మరో రెండు థీమ్ పార్కులను ఏర్పాటు చేయనున్నట్లు యాడ్లాబ్స్ ఇమాజికా తెలిపింది. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందర్నీ ఆకర్షించేలా.. డిస్నీ వరల్డ్ తరహాలో యాడ్లాబ్స్ భారత్లో థీమ్పార్క్ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. 2013లో ముంబయి - పుణె ఎక్స్ప్రెస్వేలో ఈ పార్కు ఉంది. అయితే ఇటీవల కాలంలో పర్యాటకుల సంఖ్య పెరగడంతో భారత్లో మరో రెండు పార్కులను ఏర్పాటుచేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపింది. వచ్చే మూడు నుంచి ఐదేళ్లలో ఉత్తర, దక్షిణ భారత్లో వీటిని ఏర్పాటు చేస్తామని యాడ్లాబ్స్ సీఈవో, డైరెక్టర్ కపిల్ బగ్లా తెలిపారు. దిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో ఒకటి, హైదరాబాద్ లేదా బెంగళూరులో ఒక థీమ్ పార్కును నిర్మించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. అంతేగాక.. ప్రస్తుతమున్న పార్కులోనూ మరిన్ని మార్పులు చేర్పులు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..









