షియా ప్రార్థనా మందిరంపై బాంబు దాడి
- January 31, 2016
సిరియాలోని దక్షిణ డమాస్కస్ ప్రాంతంలో షియా ప్రార్థనా మందిరమైన సయ్యిద్ జీనాబ్ వద్ద ఆదివారం రెండు భారీ పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో దాదాపు 30 మంది మృతి చెందినట్లు భావిస్తున్నారు. జెనీవాలో ఐరాస ఆధ్వర్యంలో జరిగే శాంతి చర్చల్లో పాల్గొనేందుకు సిరియా ప్రభుత్వం, ప్రత్యర్థులు కలిసిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం పేలుడు జరిగిన ప్రార్థనా మందిరాన్ని షియా ముస్లింలు అత్యంత పవిత్రమైందిగా భావిస్తారు. జీనాబ్ మందిరం వద్ద జరిగిన రెండు పేలుళ్లలో ఒక దానికి కారు బాంబు కారణం కాగా రెండో దానికి కారణాలు తెలియరాలేదని సిరియాలోని మీడియా వెల్లడించింది.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









