కరోనా కట్టడికి జెడ్డాలో మళ్లీ కర్ఫ్యూ విధించిన సౌదీ అరేబియా
- June 06, 2020
రియాద్:కరోనా తీవ్రత మళ్లీ పెరిగిపోతుండటంతో ఎర్ర సముద్ర నగరం జెడ్డాలో మళ్లీ ఆంక్షలను కఠినతరం చేస్తోంది సౌదీ అరేబియా. సిటీలో మళ్లీ కర్ఫ్యూను విధిస్తూ కొత్త మార్గదర్శకాలను ప్రకటించింది. ఇవాళ్టి నుంచి వచ్చే రెండు వారాల పాటు కర్ఫ్యూ అమలులో ఉండనుంది. ప్రతి రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉండనుంది. ఈ రెండు వారాల పాటు జెడ్డా నగరంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు ఆఫీసుల నుంచి విధుల నిర్వహించకూడదని కూడా ప్రభుత్వం ప్రకటించింది. అత్యవసర విభాగాల్లో విధులు నిర్వహించే వారికి మాత్రం కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఉంటుంది. అలాగే హోటల్స్, రెస్టారెంట్లు, కేఫ్ లు మూసివేయాలని ఆదేశించింది. అయితే..కర్ఫ్య లేని దేశీయ విమాన సర్వీసులు, ట్రైన్ సర్వీసులు యధావిధిగా కొనసాగిస్తామని కూడా వెల్లడించారు. బహిరంగ ప్రదేశాల్లో ఐదుగురికి మించి ఎక్కువ సంఖ్యలో జనం గుమికూడొద్దని ప్రభుత్వం హెచ్చరించింది.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!







