కరోనా కట్టడికి జెడ్డాలో మళ్లీ కర్ఫ్యూ విధించిన సౌదీ అరేబియా
- June 06, 2020
రియాద్:కరోనా తీవ్రత మళ్లీ పెరిగిపోతుండటంతో ఎర్ర సముద్ర నగరం జెడ్డాలో మళ్లీ ఆంక్షలను కఠినతరం చేస్తోంది సౌదీ అరేబియా. సిటీలో మళ్లీ కర్ఫ్యూను విధిస్తూ కొత్త మార్గదర్శకాలను ప్రకటించింది. ఇవాళ్టి నుంచి వచ్చే రెండు వారాల పాటు కర్ఫ్యూ అమలులో ఉండనుంది. ప్రతి రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉండనుంది. ఈ రెండు వారాల పాటు జెడ్డా నగరంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు ఆఫీసుల నుంచి విధుల నిర్వహించకూడదని కూడా ప్రభుత్వం ప్రకటించింది. అత్యవసర విభాగాల్లో విధులు నిర్వహించే వారికి మాత్రం కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఉంటుంది. అలాగే హోటల్స్, రెస్టారెంట్లు, కేఫ్ లు మూసివేయాలని ఆదేశించింది. అయితే..కర్ఫ్య లేని దేశీయ విమాన సర్వీసులు, ట్రైన్ సర్వీసులు యధావిధిగా కొనసాగిస్తామని కూడా వెల్లడించారు. బహిరంగ ప్రదేశాల్లో ఐదుగురికి మించి ఎక్కువ సంఖ్యలో జనం గుమికూడొద్దని ప్రభుత్వం హెచ్చరించింది.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







