బంగ్లాదేశ్ ఎంపీపై హ్యూమన్ ట్రాఫికింగ్ ఆరోపణలు, అరెస్ట్ చేసిన కువైట్ పోలీసులు
- June 09, 2020
కువైట్ సిటీ:కొన్నేళ్ల క్రితం వరకు అతనో సాధారణ వ్యక్తి. బ్రతుకుదెరువు కోసం బంగ్లాదేశ్ నుంచి కువైట్ చేరుకున్నాడు. ఓ క్లీనింగ్ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. కొద్ది రోజులు తర్వాత అతనే సొంతంగా ఓ క్లీనింగ్ కంపెనీ పెట్టుకున్నాడు. దాదాపు 20 వేల మందిని రిక్రూట్ చేసుకున్నాడు. కానీ రిక్రూట్ లో జరిగిన అవకతవకలు బయటపడటంతో అతన్ని హ్యూమన్ క్రింద అరెస్ట్ చేశారు. ఇదంతా కువైట్ చోటు చేసుకుంది. బంగ్లాదేశ్ నుంచి వచ్చి కువైట్ లో అతిసాధారణమై జీవితాన్ని గడిపిన కాసి బబుల్ అనే వ్యక్తి అనతి కాలంలో కోటీశ్వరుడిగా మారిపోయాడు. చివరికి బంగ్లాదేశ్ పార్లమెంట్ లో సభ్యుడిగా ఎన్నికయ్యాడు. అయితే..ఆ తర్వాతే అతని పాపం వెంటాడింది. అతని క్లీనింగ్ కంపెనీలో పని చేసేందుకు వచ్చే వారి నుంచి 1000 నుంచి 3000 దినార్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇలా మొత్తం 11 వందల కోట్ల రూపాయలను వసూలు చేసిన కాసి బబూల్.. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో నిలబడ్డాడు. ఎంపీగా గెలిచాడు. అయితే..మానవ అక్రమ రవాణా, అక్రమ మార్గాల్లో డబ్బు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు కేసు నమోదు చేశారు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







